Pages

Thursday, July 28, 2011

యెడ్డీకి ఉద్వాసనతోనే బిజెపి సమస్యలు తీరవు




ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పను తప్పించాలని బిజెపి అగ్రనాయకత్వం నిర్ణయించడం అనూహ్యమైన పరిణామం కాదు. దీనివల్ల ఆ పార్టీ ఇబ్బందులు తొలగిపోవడమూ జరగదు. కాకపోతే అవినీతిపై నిప్పులు కక్కుతూ మాట్లాడేవారు ఇన్ని రకాల ఆరోపణలకు ఆలవాలంగా వున్న ముఖ్యమంత్రిని ఎలా సహిస్తున్నారన్న కళంకం లేకుండా చేసుకోవడానికి మాత్రం ఇది పనికి వస్తుంది. అయితే రాజాను తొలగించినా ఆ భూతం మన్మోహన్‌ను వెన్నాడుతున్న స్థితి బిజెపిలోనూ పునరావృతం కావచ్చు. యెడ్డీ ఒక వేళ రాజీనామాకు అంగీకరించినా ఎల్లకాలం మౌనంగా వుండకపోవచ్చు.

మొత్తంపైన బిజెపి ఇప్పుడు బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నది. వాజ్‌పేయి రాజకీయంగా పూర్తి అచేతనమై పోవడం వాటిలో మొదటిది. అద్వానీని అనేక విధాల దెబ్బ తీసిన అంతర్గత వివాదాలకు తోడు

Tuesday, July 26, 2011

అసలు ఆయా పార్టీలలో ఏకాభిప్రాయం వుందా?



తెలంగాణా సమస్యపై హౌం మంత్రి చిదంబరం చేసిన తాజా వ్యాఖ్యలుతో కేంద్రం ఎత్తుగడలు స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి.

1.డిసెంబరు 9 ప్రకటన ప్రభుత్వం తరపున అని చెప్పే చిదంబరం కాంగ్రెస్‌ పార్టీ ఒక వైఖరి తీసుకోలేదని గతంలో చెప్పారు. అంటే నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం వైఖరి తీసుకోకుండానే ప్రకటన సాధ్యమా?

2.పార్టీల మద్య ఏకాభిప్రాయం కావాలని అంటున్న కేంద్రం ఆ పని తమతోనే మొదలు పెట్టొచ్చు. ఆజాద్‌ ఆ పని చేస్తున్నారని చిదంబరం అంటున్నారు గాని దీనితో కాంగ్రెస్‌ నాయకులే చాలామంది ఏకీభవిస్తారా?

3.ఒకే ప్రాంతంలోని వివిధ పార్టీలు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటున్నప్పుడు- ఒకే పార్టీ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మాట్లాడుతున్నప్పుడు

Sunday, July 24, 2011

జగన్‌పై ఆరోపణల దర్యాప్తు


ఇటీవలి కాలంలో పాలక వర్గమూ మీడియా కేంద్రీకరించే అంశాలు రెండే - తెలంగాణా, జగన్‌. ఈ రెండవ అంశానికి సంబంధించి వచ్చిన పరిణామాలు రాజకీయాలపై ప్రభావం చూపిస్తున్నాయి. జగన్‌పై వచ్చిన అరోపణలను ప్రాథమికంగా దర్యాప్తు చేసి రెండు వారాల్లో నివేదిక నివ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించడం ముఖ్యమైన మలుపు. దీన్ని వెంటనే స్వాగతించి సంసిద్ధమయ్యే బదులు సుప్రీం కోర్టులో నిలుపదల ఉత్తర్వుల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దేశమంతటా అవినీతి ఆరోపణలపై పెద్ద వుద్యమాలు నడుస్తున్న స్తితిలో ఈ దర్యాప్తును సుప్రీం కోర్టు ఆపుతుందని ఎవరూ అనుకోలేదు కూడా. ఇప్పుడు సిబిఐ ఎలాటి విషయాలు నివేదిస్తుందో వాటిపై న్యాయస్థానాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిందే. అయితే జగన్‌ పార్టీ నాయకులు ఈ కేసును రాజకీయ కుట్ర కింద కొట్టి వేయడం మాత్రం ఎవరూ హర్షించలేదు. గతంలో వీటిని సహించిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఇదంతా చేయడంలో రాజకీయాలు వున్నాయనేది నిజమే అయినా వాస్తవాలు ప్రజల ముందు వుంచాల్సిన బాధ్యత జగన్‌పై వుందనేది అంతకన్నా పెద్ద నిజం.

చెల్లిపోయిన రాజీనామాలు- ప్రాంతీయుల కొత్త వ్యూహాలు?



ఈ వారం రోజుల్లోనూ రాష్ట్ర రాజకీయాలు, వాటికి కేంద్ర బిందువైన ఢిల్లీలో వ్యవహారాలు పరశీలిస్తే ప్రాంతీయ రాజకీయ క్రీడల వెనక స్వార్థాలను కళ్లకు కట్టి చూపిస్తున్నాయి. ఎవరి మాటల్లో వాస్తవమెంతో ఎప్పటికప్పుడు వారి చర్యల ద్వారానే తేటతెల్లమవుతున్న పరిస్థితి. ఈ క్రీడలతో ప్రజలను నమ్మించి కాలం గడపాలన్న ప్రధాన పార్టీలు తమకు తామే ఆత్మరక్షణ స్తితిలో పడిపోయాయి.. రాజినామాలతో రాజకీయ సంక్షోభం ముంచుకొచ్చి రాష్ట్ర విభజన జరిగిపోతుందని చెప్పిన జోస్యాలకూ తర్వాత పరిణామాలకు పొంతన లేదు. ఇప్పుడు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆ రాజీనామాలన్నిటినీ గుండుగుత్త గా తిరస్కరించడంతో ఒక ఘట్టం ముగిసింది. అదే మళ్లీ పునరావృతమవుతుందా లేక ప్రాంతాల వారి వ్యూహాల్లో

Thursday, July 21, 2011

ప్రజల పేరిట నేతల భీషణ దూషణలేల?





రాష్ట్రంలో ప్రజలందరూ ప్రాంతాల వారిగా విడిపోయారన్నది నిరంతరం వినిపించే ఒక మాట. తమ ప్రాంతం విభజన జరగాలని కోరుకోవడం వేరు, మరో ప్రాంతానికి చెందిన వారిని నిరంతరం ప్రస్తావిస్తూ విరుచుకుపడటం వేరు.ఉదాహరణకు తెలంగాణా ప్రాంతంలో చాలా మంది రాష్ట్రం వస్తే బాగుంటుందని అనుకుంటుండవచ్చు. కాని మరో ప్రాంతానికి సంబంధించి ఉద్రేక పూరితంగా మాట్లాడాలనుకోవడం లేదు. అలాగే కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారిలోనూ తక్కిన వారిపై ఎలాటి కోపభావమూ లేదు.ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా ప్రజలే. చారిత్రిక నేపథ్యాలు ప్రాంతీయ అసమానతలు రాజకీయ వేత్తల మాయోపాయాల నేపథ్యంలో వారు పరిపరి విధాల స్పందిస్తుంటారు. అనుభవాల నుంచి నేర్చుకుని అవకాశవాదులకు పాఠాలు నేర్పుతుంటారు. అయితే ఏ దశలోనూ తెలుగు మాట్లాడే సామాన్య ప్రజలు ప్రాంతాల వారిగా కోపతాపాలకు గురి కాలేదు. కాని తమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పే నాయకులే అటూ ఇటూ ద్వంద్వ భాషణం చేస్తూ వాతావరణం కలుషితం చేస్తున్నారు. ఈ విషయంలో మొదట విమర్శలకు గురైంది టి.ఆర్‌.ఎస్‌. కెసిఆర్‌, హరీష్‌ రావు తదితరులు వివిధ సందర్భాలలో వివాదాస్పదంగా మాట్లాడ్డంపై అందరూ విమర్శలు చేశారు. అవి న్యాయమే కూడా. అయితే మరో వైపున కాంగ్రెస్‌ నాయకులు టిజివెంకటేష్‌, లగడపాటి రాజగోపాల్‌, పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ తదితరులు అంతకంటే ఏమీ తీసిపోని రీతిలో ఉద్రేక భాషణలు చేశారు. ఈ జాబితాలో ఇప్పుడు తెలుగు దేశం నేతలు కూడా చేరిపోయారు. రెండు ప్రాంతాలలో రెండు రకాలుగా మాట్లాడ్డం ఒకటైతే ఆ మాటల తీవ్రత ఎవరూ ఆమోదించలేని రీతిలో వుంది. అగ్ని గుండం గా మార్చడం గురించి కెసిఆర్‌ అన్నప్పుడు నా లాటి వాళ ్లమంతా సరికాదని వ్యాఖ్యానించాము. కాని ఎర్రం నాయుడు, పయ్యావుల కేశవ్‌ వంటి వారు కూడా అదే భాషలో మాట్లాడినప్పుడు తేడా ఏముంది?దీనిపై టివి5 చర్చలో ప్రస్తావిస్తే తాను అలా అనలేదని కేశవ్‌ ఖండించారు. కాని తర్వాత అంత కంటే తీవ్రంగా ఆత్మాహుతి దాడులను గురించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రాంతీయ చెలగాటం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పే తెలుగు దేశం నేతలు తామైనా అందుకు భిన్నంగా వుండలేక పోవడం నిజంగా శోచనీయం. దయాకరరావు, కేశవ్‌ గీతకు చెరోవైపున నిలబడి భీషణ భాషణలు చేస్తుంటే ఎవరూ హర్షించరు.
ఇంతకూ ఈ మాటలతో పని ఏమిటి? కాంగ్రెస్‌ నాయకులు గాంధీ భవన్‌లోనూ తెలుగు దేశం నాయకులు ఎన్టీఆర్‌ ట్రస్టులోనూ కూచుని కలసి మాట్లాడుకోవచ్చు. అలాగే సీమాంధ్రలో విభజనకు అనుకూలమైన శక్తులు చాలా వున్నాయని చెప్పే టిఆర్‌ఎస్‌ వారిని తెలంగాణా భవన్‌నకు రప్పించి చర్చించవచ్చు. అంతేగాని ఈ విధంగా కవ్వింపు ధోరణిలో మాట్లాడ్డం ఏ ప్రాంతంలోని ఏ నేతలకూ తగదు. వివిధ ప్రాంతాలలో ప్రజలు ఏమనుకుంటున్నప్పటికీ ఈ విధంగా బెదరింపు ధోరణిలో మాత్రం మాట్లాడ్డం లేదు. వారి పేరుతో నాయకులే చేస్తున్నారు. బహు పరాక్‌!

మర్దోక్‌ గ్లోబల్‌ మీడియానం



సమాచారమూ వినోదమూ కలగలసి పోయిన ప్రస్తుత వ్యవస్థను ఐస్‌(ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌,ఎంటర్‌టైన్‌మెంట్‌) అంటుంటారు గాని ఇది మృత్యుశీతలం కాకూడదని నేను తరచూ చెబుతుంటాను. ఇప్పుడున్నది డెమోక్రసీ కాదు, మీడియోక్రసీ అనే మాట కూడా అలాటి వాటిలో ఒకటి. నామ్‌ చామ్‌స్కీ పుస్తకం మొదటి అధ్యాయాన్ని సుదీర్ఘ ఉపోద్ఘాతంతో అనువదించి ప్రచురించేప్పుడు 'మీడియా మాయాజాలం' అని దానికి నామకరణం చేశాను. అన్ని మీడియా వల్లనే జరుగుతున్నాయనీ, మీడియా అంటే నిర్వికార తీర్పరి పాత్ర పోషిస్తుందని కొందరిలో వున్న భ్రమలను పోగొట్టడానికి, కొందరు కల్పించే భ్రమలను తిరస్కరించడానికి ఈ పదాలన్ని సృజించబడ్డాయి. ఇందుకు అర్థ శతాబ్దం ముందే మహాకవి పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పుత్రికలపై ధ్వజమెత్తి వున్నాడు కూడా.. ఈ విమర్శలన్ని ప్రపంచీకరణ క్రమంలో వందల వేల రెట్లు వికృతంగా తయారైనాయి.
కళ్లముందు జరుగుతున్న రూపర్ట్‌ మర్డోక్‌ జుగుప్సాకర ప్రహసనమే తీసుకుంటే తన మాటల్లోనే 53 వేల మంది సిబ్బంది పనిచేసే గ్లోబల్‌ మీడియా బేరన్‌, డాన్‌! అంతటి వాడు న్యూస్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ దొంగచాటు ఫోన్‌ ట్యాపింగ్‌ కుంభకోణంలో దొరికి పోయి చెంపలు వాచేలా క్షమాపణలు

Saturday, July 16, 2011

ప్రాంతాల ప్రజ్వలనలో కొత్త దశ?

విజయవాడలో కోస్తా, రాయల సీమ జిల్లాల కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు సదస్సు జరపడం గతంలోనే చెప్పుకున్నట్టు ప్రాంతీయ వివాదాలు పెంచే పాలక పక్ష వ్యూహంలో కొత్త దశను సూచిస్తుంది. దీనికి ఉత్తరాంధ్ర ప్రతినిధులు హాజరవలేదని మరో సమాచారం. అంటే అదో ఉప స్రవంతి. రేపు రాయలసీమ లేదా ఉత్తర తెలంగాణా వంటి తేడాలు కనిపించినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇంతకూ అన్ని చోట్లా వారే వుండి ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తూ ఒకే అధిష్టానానికి మొరపెట్టుకుంటూ ప్రభుత్వాన్ని మాత్రం కాపాడుకోవడం పెద్ద రాజకీయ వైపరీత్యం. కేంద్రం ప్రాంతీయ క్రీడకు ఆజాద్‌ వ్యాఖ్యలు పరాకాష్ట అని లోగడ ఈ బ్లాగులో రాశాను. ఆ రసవత్తర క్రీడలో పాలక పాత్రధారులు అటూ ఇటూ కూడా విజృంభించనున్నారనడానికి ఇందిరా పార్కు ధర్నా, వెనువెంటనే జరిగిన విజయవాడ సదస్సు నిదర్శనాలు. ఇన్నిటి మధ్యనా కె.సి.ఆర్‌ రెండు వారాల్లో తెలంగాణా వచ్చేస్తుందని చెప్పడం అక్షరాలా ఆశ్యర్యకరమైన ప్రకటన. గతంలో గడువులు ప్రకటించి ఆచరణలో ఏం జరిగిందో చూశాక కూడా ఆయన అదే ధోరణి కొనసాగిస్తున్నారంటే తన వెనకనున్న వారిలో విశ్వాసాన్ని నిలబెట్టడం కోసమే అనుకోవాలి.ఇంతకూ ఆశతో వుండటం వేరు, ఆధారం లేని ఆశలు కల్పించడం వేరు. వాటిని కారణంగా చూపించి మరో వైపున వాతావరణాన్ని వేడెక్కించడం వేరు. ఇవన్నీ ఒకే రాజకీయ జాలంలో భాగాలు. ఇందులో తెలుగు దేశం కూడా తన వంతు పాత్ర తాను పోషిస్తున్నది. మొదటి దోషి కాంగ్రెస్‌, రెండవ దోషి తెలుగు దేశం అని ఎవరో అంటే మూడవ దోషి టిఆర్‌ఎస్‌ కూడా అని ఇటీవల ఒక చర్చలో అన్నాను.దోషం ఎవరిదైనా నష్టం జరిగేది ప్రజలకే. ప్రాంతాల వారీ వివాదాలు పెరుగుతుంటే పాలకులు చక్కగా పెట్రోలు వగైరా ధరలు పెంచేస్తారు. స్కాములతో దేశాన్ని దోచేస్తారు. ఎందుకంటే ఆ విషయంలో వారికి ఏ ప్రాంతీయ తేడాలు వుండవు. ప్రజలపట్ల బాధ్యతా లాంఛనంగానే భావిస్తారు.

పేపరాజ్జి వరవడిలోనే మేడిపండు మీడియా

మీడియా సామ్రాజ్యాధినేత రూపర్ట్‌ మర్డోక్‌ యాజమాన్యంలోని న్యూస్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ మూసివేతకు దారి తీసిన వ్యవహారాలు ఆ రంగంతో సంబంధం వున్నవారికి తలవంపులు తెస్తున్నాయి. వ్యక్తుల ప్రైవేటు సంభాషణలు ప్రైవేటుగా విని ప్రచురించి ఆకర్షణీయమైన కథలుగా ప్రచారం చేసుకోవలసిన దురవస్థ ఎందుకు దాపురించింది? ప్రిన్సెస్‌ డయానా 1997లో పారిస్‌ వీధుల్లో చవకబారు పత్రికా సైన్యం వెంటతరుముతుండగా తప్పించుకోబోయి దుర్మరణం పాలైంది. ఆమె మరణానంతరం పదేళ్లకు బ్రిటిష్‌ ఎడిటర్ల సంఘం ఇందుకు క్షమాపణలు ప్రకటించడమే గాక ఇలాటి వికృతాలు పునరావృతం కానివ్వబోమని ప్రకటించింది. అయితే ఇటీవల ఒక బాలిక అపహరణ, పైశాచిక హత్య విషయంలో మర్డోక్‌ మీడియా వ్యవహరించిన తీరు అదెంత ఘోరంగా ఉల్లంఘించబడిందో నిరూపించింది. దీనిపై ఇప్పుడు కూడా మర్దోక్‌ క్షమాపణలు చెప్పి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆ పత్రికను మూసివేస్తున్నట్టు కూడా ఘనంగా ప్రకటించారు. దేశ దేశాలలో పత్రికలు ఛానళ్లను శాసించే మర్డోక్‌కు ఇదో లెక్కలోది కాదు గాని దీనివల్ల ఒరిగేది కూడా వుండదు. తప్పు చేయని జర్నలిస్టులు, సిబ్బంది కూడా వీథుల పాలు కావడం తప్ప ఇలాటి దుస్సంప్రదాయాలు మాత్రం మూత పడేది వుండదు. మీడియాపై చాలా మందికి చాలా భ్రమలు వుంటాయి గాని నిజానికి సంపన్న దేశాలలో అది రాను రాను మరీ వికృత పోకడలకు నిలయమవుతున్నది. మన మీడియా సంస్థలు కూడా అదే కోవలో నడిచి అనేకసార్లు జుగుప్సకు కారణమవుతుంటాయి. వ్యక్తుల చిల్లర మల్లర విషయాలకు గాక వ్యవస్తాగతమైన మూలాలకు ప్రాధాన్యత రావాలంటే మీడియా యాజమాన్య స్వరూపంలోనూ మార్పు రావాలి. వినోదపు ఛానళ్లలో నేరుగా విదేశీ భాగస్వామ్యం అనుమతించే ప్రస్తుత నిబంధనల వల్ల భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారినా ఆశ్చర్య పోనవసరం లేదు.

Thursday, July 14, 2011

ముంబాయి పేలుళ్లు దేశానికి సవాలు

ముంబాయి నగరంలో పరంపరగా జరుగుతున్న పేలుళ్లు అఖిలభారతానికి ఆవేదన కలిగిస్తాయి. ఆందోళన నింపుతాయి. మృతుల కోసం భాష్పాంజలి ..అదే సమయంలో ఇంత పెద్ద దేశపు నిఘా వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, పాలనా విభాగం, రాజకీయ నాయకత్వం బాధ్యతపైనా ప్రశ్నలు వస్తాయి. తాజ్‌ హౌటల్‌ దాడి తర్వాత కూడా మనం ఏం పాఠాలు నేర్చుకున్నామో అర్థం కాదు.
మతతత్వ శక్తులు, మాఫియా ముఠాలు, స్మగ్లర్లు, అవినీతి పరులైన రాజకీయ వాణిజ్య వేత్తల విషవలయమే ముంబాయి.అంతర్జాతీయంగా అమెరికా అండదండలు గల పాకిస్తాన్‌ సాగించే కుట్రలు మరో వైపు. ఇన్నిటి వల్ల టెర్రరిస్టులు దాడి చేయగలుగుతున్నారు.మన పోలీసులు నిఘా అధికారుల సంఖ్యను సమర్థతనను సాధన సంపత్తిని పెంచడం సమన్వయ పర్చడం ఇక్కడ కీలకం.లష్కరే తోయిబాకు అనుబంధమైన ఇం డియన్‌ మొహజదీన్‌ ఇందుకు బాధ్యత వహించాలని చెబుతున్నా అధికారికంగా ధృవీకరించ వలసి వుంది. ఇప్పుడు కారకులెవరైనప్పటకీ వారికి దోహదం చేస్తున్న దేశ వాతావరణం అంతర్జాతీయ నేపథ్యం కూడా గమనంలోకి తీసుకోవలసి వుంటుంది.
అన్నిటినీ మించి ఉగ్రవాదులను ,వారికి బలై పోయిన వారిని మతాలను బట్టి చూసే ధోరణి కూడా మారవలసి వుంటుంది. దేశ భద్రత ప్రజా రక్షణ విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ కలసి కట్టుగా వ్యవహరిస్తేనే భద్రత సాధ్యం.  పొరబాట్లను ,వైఫల్యాలను సమీక్షించుకునే బదులు (రాహుల్‌ గాంధీ )99 శాతం బాగా చేశామని  కితాబులిచ్చుకుంటే మరింత నష్టం.

ఆజాద్‌ వ్యాఖ్యలు- అనంతరం....

ఆంధ్ర ప్రదేశ్‌ భవిష్యత్తుకు సంబంధించి కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ చేసిన తాజా వ్యాఖ్యలు అనిశ్చితిని అధికారికంగా కొనసాగించదల్చుకున్నట్టు స్పష్టం చేశాయి. ఇంచుమించు గత రెండేళ్లనుంచి ప్రజల మనోభావాలతో దాగుడు మూతలాడుతున్న కేంద్ర బాధ్యతా రాహిత్యానికి ఆజాద్‌ వ్యాఖ్యలు పరాకాష్ట అని చెప్పాలి. అయితే తాము సృష్టించిన సంక్షోభాలకు బాధ్యతను రాష్ట్రంలో రాజకీయ పార్టీలపైన, భిన్న ప్రాంతాలలో ప్రజలపైన మోపడానికి కూడా ఆజాద్‌ ప్రయత్నించిన తీరు హాస్యాస్పదమైందీ హానికరమైందీ కూడా. పనిలో పనిగా శ్రీకృష్ణ కమిటీని కూడా ఆయన తప్పు పట్టారు. ఆ కమిటీ ఏదో పరిష్కారం చూపిస్తుందనుకుంటే చూపించకపోవడం వల్లనే నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు మాట్లాడ్డం ఇంగిత జ్ఞానాన్ని పరిహసించడమే. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ తన దృష్టిలో ఏది ఉత్తమ పరిష్కారమో

Friday, July 8, 2011

తాజా పరిణామాలు- పరిశీలనలు

1.కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి ప్రధానితో జరిపిన సమావేశానికి శృతి మించిన ప్రాధాన్యత లేదనుకుంటున్నాను. ఆయన ఆచితూచి మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనం.ఇంత కీలక సమయంలో తాను ఖాళీగా లేనని, తన వంతు చేస్తున్నానని అర్థం కావడానికి ఆయన ఈ భేటీ జరిపి వుండొచ్చు. అంతేగాని అడుగు ముందుకు వేసి అనునయ వాక్యాలైనా చెప్పడానికి సిద్దంగా లేరు. ఆఖరుకు సంయమనం పాటించాలని, ప్రశాంతత కాపాడుకోవాలని కూడా చెప్పక పోవడం గమనించదగ్గది. ఈ మాటలు చెప్పడానికి క్యాబినెట్‌ హౌదా అడ్డమేమీ కాదు. ఇప్పుడు తెలంగాణా విభజన కోరే వారి వాణిని వినిపించే సుఖేందర్‌ రెడ్డి జైపాల్‌ మేనల్లుడు(?) కాగా మందా జగన్నాథం బాగా సన్నిహితుడు. ఈ ఇద్దరూ తెలుగు దేశం నుంచి వచ్చిన వారే కావడం మరో విశేషం. సీనియర్‌ మంత్రిగా జైపాల్‌ రెడ్డి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలనే అందరూ కోరుకుంటారు గాని ఆయన తన పరిమితులను అతి జాగ్రత్తగా పాటిస్తున్నారు.
2. కాంగ్రెస్‌ నేత దామోదర్‌ రెడ్డి జెఎసి గురించి చేసిన వ్యాఖ్యలు రాజినామాల తర్వాత కూడా కొనసాగుతున్న రాజకీయ వైరుధ్యాలను వెల్లడిస్తున్నాయి. ఈ సందర్భంలో స్వంత అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి

Tuesday, July 5, 2011

రాజీనామాల ప్రభావం - అంచనాలు, అతిశయాలు



తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌, తెలుగు దేశం( తాజాగా టిఆర్‌ఎస్‌) ప్రజా ప్రతినిధుల రాజినామాల పర్యవసానాలపై ఇప్పుడు తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయంతో అధిష్టానం దిగిరాక తప్పదని టిఆర్‌ఎస్‌ నేతలు ముందుకు నెడుతూ వస్తున్నారు గాని కేంద్ర పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ హొంమంత్రి చిదంబరం ఆ అంచనాలను పూర్తిగా పూర్వపక్షం చేసేలా మాట్లాడారు. రాజినామాలకు సంబంధించి కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పుకోవచ్చు.
1.ప్రత్యేక రాష్ట్రానికి తాము కట్టుబడి వున్నామని నిరూపించుకోవడానికి కాంగ్రెస్‌ నేతల రాజినామాల సమర్పణ ఉపకరిస్తుంది.
2.ఇప్పటి వరకూ దాడులకు విమర్శలకు లక్ష్యంగా వున్న తెలుగుదేశం నేతలు ఆ తాకిడి నుంచి కాస్తయినా బయిటపడటానికి తాము ఈ విషయంలో గట్టిగా వున్నామని తప్పు కాంగ్రెస్‌దేనని చెప్పుకోవడానికి అవకాశం కలుగుతుంది
3.కేంద్రం నుంచి అన్నీ అననుకూల సంకేతాలే వస్తున్న నేపథ్యంలో టిఆర్‌ఎస్‌, జెఎసిలు వేడి పెంచేందుకు