Pages

Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

Sunday, September 9, 2012

గురజాడ వెలుగుజాడ






తెలుగు సాహిత్యంలో నూత యుగావిర్భావాన్ని సూచించే వేగుచుక్క గురజాడ అప్పారావు. పంథొమ్మిదో శతాబ్దపు వ్యక్తిని ఇరవై ఒకటో శతాబ్దంలోనూ చెప్పుకుంటున్నామంటే అందుకు కారణాలు అనేకం.


పెరిగి విరిగితి
విరిగి పెరిగితి
కష్టసుఖముల
సారమెరిగితి

కొత్తమిన్కుల
తెలివితేటల
మంచి చెడ్డల
మార్చితిన్‌! అని స్వయంగా చెప్పుకున్న గురజాడ నిజంగానే సమాజంలో మంచి చెడ్డల గురించి పాతుకుపోయిన అభిప్రాయాలను ప్రశ్నించి సమూలంగా పరిష్కరించేందుకు కలం పట్టాడు.
ఎప్పుడైనా యుగకర్తలైన వారు సాహిత్య ద్రష్టలుగానే గాక సామాజిక ద్రష్టలుగా కూడా వుంటారు. వారి భావనలు కాలరేఖలను దాటి తదుపరి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. వారి మాటలు కొత్త బాటలు వేస్తాయి. గురజాడ అక్షరాలా తెలుగువారి వెలుగుజాడ. గురజాడ అప్పారావు అగ్రస్థానం కేవలం ఏ ఒక్క కోణం నుంచో, ఒక్క కారణం నుంచో లభించింది కాదు.
గురజాడ సనాతన కుటుంబంలో పుటిyనా దైవభ'క్తిని బోధించడానికి పరిమితం కాలేదు. పైగా దైవభావనకు మానవతాపూరితమైన వ్యాఖ్యానం ఇచ్చాడు. తను రాజుగారి కొలువు చేసినా రాజభ'క్తికే పరిమితం కాలేదు. ఈ రెంటినీ మించిన దేశభ'క్తిని చాటి చెప్పాడు. అది కూడా సంకుచితమైన, దురభిమానపూరితమైన దేశభ'క్తి కాదు. ఏ దేశంలోనైనా అనుసరించగల విశ్వజనీనమైన దేశభ'క్తి, ఆ గీతానికి ప్రపంచ జాతీయగీతం కాగల శక్తి వుందని మహాకవి శ్రీశ్రీ అందుకే అంటాడు.
దేశభ'క్తిని బోధించడమే కాదు - దేశం అంటే ఏమిటో కూడా తొలిసారి గురజాడ చెప్పారు. అంతకు ముందు కాలంలో దేశం అంటే నదులు, పర్వతాలు అని కీర్తించే భౌగోళిక దృష్టి మాత్రమే వుంది. లేదా రాజుల విజయాలనే చెప్పే ధోరణి వుంది. గురజాడ ఆ దృక్పథాలను మార్చేశారు. దేశమంటే మట్టికాదు, మనుషులన్నాడు. మనుషులంటే ఎవరనే ప్రశ్న ఆ వెంటనే వచ్చింది. తిండి కలిగితే కండ కలదోరు, కండ కలవాడేను మని'ోరు అన్నాడు. 'మనిషి చేసిన రాతి బొమ్మకు మహిమ కలదని సాగి మొక్కుతు మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగా చూస్తావేల బాలా' అని ప్రశ్నించాడు.
అప్పటిదాకా అంతా రాజులు, మతాధిపతులు, ఆచార్యులు చెప్పినటేy జరిగింది. అలాగాక సామాన్యమైన మనిషిని కేంద్రబిందువుగా చేసుకోవాలన్న దృషిy పునర్వికాసయుగంలో వచ్చింది. మానవతా వాదం అన్నమాటను ఈనాడు మనం మరో అర్ధంలో వాడుతున్నాం గాని అది మొదట వాడుకలోని వచ్చిన సందర్భం అదే. దాన్ని తెలుగునాట శక్తివంతంగా

Friday, August 17, 2012

వేమన భాష, భావ సర్వస్వం


తెలుగు వారికి అత్యంత ప్రియమైన కవి ఎవరంటే వేమనే. అంత పొడుపుగా అంత పొదుపుగా చెప్పిన వారు అప్పుడూ ఇప్పుడూ కూడా అరుదే. అక్షరాక్షరంలో అర్థం పొదిగి ఇచ్చిన ప్రజాకవి గనకనే నాలుగు శతాబ్దాల తర్వాత కూడా ఆయన పద్యాల నాలుకలపై నాట్యమాడుతున్నాయి. అన్ని సందర్భాలకు అతికినట్టు సరిపోతున్నాయి. ఆలోచనలకు పదును పెడుతూనే వున్నాయి. అనేక సార్లు ఆయుధాలవుతున్నాయి. అలాటి వేమనను గుర్తించడంలోనూ గౌరవించడంలోనూ చాలా ఆలస్యమే జరిగింది. అన్యాయమూ జరిగింది.దీనికి చాందసత్వం స్వార్తపర వర్గాల కుటిలత్వం కారణాలు. మొదట బ్రౌన్‌ పండితుడు వేమనను వెలికి తీసి వెలుగులోకి తెస్తే తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఆయనకు సముచిత వ్యాఖ్యాత అయ్యారు. అయితే ఇంత గొప్ప వాడైన వేమనపై సమగ్ర సాధికారిక పరిశోధన చేసిన సాహిత్య వేత్త కవి డా.ఎన్‌.గోపి. 35 ఏళ్ల వయసులోపే వేమనపై పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు. అంత కన్నా ముందే వేమన్న వేదం పుస్తకమూ ప్రచురించారు. ఒక విధంగా వేమన పట్ల పునరాసక్తి పెంచిన వారిలో గోపీ ప్రథములు. ఆయన పరిశోధన ప్రజాకవి వేమన పేరిట ప్రచురితమైంది.ఈ క్రమంలో గోపి ఆ పద్యాలను విశేషంగా అధ్యయనం చేసి నిగ్గు తేల్చారు. పారిస్‌లో వున్న అరుదైన ప్రతిని తెప్పించి ప్రచురింపచేశారు. అప్పటి వరకూ తెలియని ఏడు పద్యాలు కొత్తగా పరిచయం చేస్తూ ఆయన పేరిట చలామణిలో వున్న కొన్ని నిజానికి కాదని తేల్చారు.
ఆ తర్వాత కాలంలో ఆరుద్ర కూడా వేమనకు సంబంధించి అనేక అంశాలు తెలియజేసినా శ్రీశ్రీ నిరంతరం వేమన స్మరణ చేస్తూనే వున్నా ఈ అనంత పరిశోధన వల్ల గోపి వేమన వేదానికి భాష్యకారుడైనారు. రెండేళ్ల కిందట సాక్షి పత్రికలో తన అనుభవాన్ని రంగరించి 428 పద్యాలకు సమగ్రమైన తాత్పర్య సహిత వ్యాఖ్యానం రాశారు. కేవలం పద్యాలకు వ్యాఖ్యానానికే పరిమితం కాకుండా విలక్షణమైన వేమన పద ప్రయోగాన్ని విప్పిచెప్పేందుకు విశేషమైన శ్రమ చేశారు.అలాగే వేమన తత్వాల పూర్వాపరాలను వాటి వెనక చారిత్రిక నేపథ్యాన్ని సమకాలీన భావాలనూ కూడా పొందుపర్చారు. ఈ పద్య పాదాలకు వున్న పాఠాంతరాలను కూడా ఇస్తూ ఏది ఔచిత్యానికి దగ్గరగా వుందో వివరించారు.
అకారాది క్రమంలో ఎంపిక చేసిన ఈ పద్యాలు వేమన మూడు వేల పద్యాల సారాంశానికి ప్రాతినిధ్యం వహించేవిగా వున్నాయని

Thursday, September 15, 2011

కృష్ణశాస్త్రీయ గీతామృతం


తెలుగు తియ్యదనమూ, ప్రకృతి సౌందర్యమూ, ప్రేమ సౌకుమార్యమూ, మానవీయ మహత్వమూ కలబోసుకున్న మధుర భావకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావ కవితా పితామహుడుగా సుప్రసిద్ధుడైన ఆయన తెలుగు సినిమా పాటకూ గోరింట వన్నెలు అద్దారు. తర్వాతి కాలంలో మరెవరైనా సున్నితమైన పదాలతో సుకుమార గీతాలు రాసినా వాటిని వెనువెంటనే కృష్ణశాస్త్రి రచనలుగా పరిగణించేంత బలంగా చెరగని ముద్రవేశారు. మనసు లోలోతులు తాకే మధుర వీవన వంటిది ఆయన పాట. గుండెలలో గులాబీలు పూయించే సృజన శీలత ఆయన కలానిది. రాసిన పాటల సంఖ్య తక్కువే అయినా వాటి ప్రభావం ప్రాభవం అనితర సాధ్యమైనవి. మల్లీశ్వరితో బిఎన్‌రెడ్డి రంగ ప్రవేశం చేయించిన దేవులపల్లి వాణిజ్య చిత్రాలలోనూ తన బాణీ నిలబెట్టుకోవడం అసాధారణ విజయం.
దేవులపల్లి కృష్ణశాస్త్రి చలన చిత్ర గీతాలు గతంలో మేఘమాల,గోరింట పేర్లతో సంపుటాలుగా వెలువడ్డాయి.ఇప్పుడు ఆ రెంటినీ కలిపి విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌ వారు ఒకే పుస్తకంగా తెచ్చారు. కృష్ణశాస్త్రి రచనా సర్వస్వంలో మూడవ సంపుటంగా వెలువడిన ఈ వెండితెర పాటలు రస హృదయులైన ప్రేక్షకులకు కవితాభిమానులకు గొప్ప కానుకలేనని చెప్పాలి.
సహజంగానే ఈ పుస్తకం మల్లీశ్వరి పాటలతో మొదలవుతుంది. అందులోని పదిహేను పాటలు కృష్ణశాస్త్రివే. అందులోకోతి బావకు పెళ్లంట, పరుగులు తీయాలి, పిలిచినా బిగువటరా వంటివి బాగా గుర్తున్నవే కాని అంతకంటే ప్రసిద్ధమైనవి ఇంకా చాలా వున్నాయి. పుస్తకానికి శీర్షికంగా అమరిన 'అందాల ఓ మేఘమేలా' 'ఔనా నిజమేనా' మనసున మల్లెల మాలలూగెనే వగైరాలు. బిఎన్‌ తీసిన మరో కళాఖండం ' బంగారు పాప'లో 'తళాంగు థకదిమి తోల్‌ బొమ్మ దీని తమాష చూడవె కీల్‌బొమ్మ' అన్న పాట వేదాంత ధోరణిలో సాగితే 'యౌవన మధువనిలో వన్నెల పూవుల వుయ్యాల' అనేది చక్కటి ప్రేమ గానం.'భాగ్యరేఖ'లోనూ ఆయన చాలా పాటలు రాశారు గాని అందులో

Saturday, September 10, 2011

సంపూర్ణ సంపాదకుడు..



సున్నితమైన పద పొందిక, సముచితమైన వాక్య నిర్మాణం, సమతుల్య ప్రతిస్పందన కలిస్తే నండూరి రామమోహనరావు. ఆయన సంపాదక శాస్త్ర సాహిత్య వేత్త. తెలుగు సంపాదకులు సర్వజ్ఞులు అని ఆయన అంటుండేవారు. ఏ అంశంపైనైనా ఎడాపెడా రాసేస్తుంటారనీ, రాయాల్సి వుంటుందనీ ఆయన భావం. తను మాత్రం ఏది ఎడాపెడా రాయలేదు. ఆచి తూచి రాశారు. అలాగే జీవించారు. పాత్రికేయులకు ప్రామాణికంగా నిలిచార్తు. ఎన్నో వాద వివాదలతో నిండిన నేటి వాతావరణంలోనూ ప్రతివారూ ఆయనకు తలుచుకున్నారంటే కారణమదే. ప్రగతిశీల పాత్రికేయుడుగా మొదలై అనువాదాలలో రాణించి వైజ్ఞానిక రచనలకు వరవడి పెట్టి సంపాదకుడుగా స్థిరముద్ర వేసిన దినీ విజ్ఞాన సర్వస్వం ఆయన. అంత జ్ఞానవంతుడైనా ఒద్దికగా వుంటూ కలసిన ప్రతివారినీ ప్రభావితం చేసిన సంయమి.
నండూరి జీవిత సాఫల్యానికి బలమైన నేపథ్యమే వుంది. బళ్లో చదువుకుంటున్నప్పుడే విజ్ఞానం అన్న లిఖిత పత్రకను నడపడం ఆయన భావి జీవిత సంకేతం. అమ్మ సేకరించి పెట్టిన శ్రీ మహాభక్త విజయం చిన్నతనంలోనే చదివి దైవభక్తులతో పాటు దేశ భక్తుల జీవితాలూ తెలుసుకున్నారు. పెత్తండ్రి నండూరి శివరావు గుడివాడలో ప్రచురణాలయం స్థాపించడం వల్ల ద్విజేంద్రలాల్‌ రారు బెంగాలీ నాటకాల అనువాదాలు చదివే అవకాశం వచ్చింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే 'తేళ్లకు జెర్రులకు కూడా వెరవక అటకపైన వున్న ఆ కట్టలు తీసుకుని' చదువుతుండేవారు. ఆ వూపులోనే

Sunday, December 12, 2010

ప్రజా కవిత్వ వైతాళికుడు

- తెలకపల్లి రవి
 సంప్రదాయం ప్రకారం మనకు మహా రాజశ్రీలు, బ్రహ్మశ్రీలు వున్నారు. రాజులను, స్వాములను సంబోధించేటప్పుడు శ్రీశ్రీశ్రీ అని ఒకటికి రెండు గౌరవ వాచకాలు చేర్చే ఆనవాయితీ కూడా వుంది.

అలాటి అతిశయోక్తులేమీ లేకుండానే సహజ నామంలోనే రెండు శ్రీశ్రీలు ఇముడ్చుకున్న ఒకే ఒక సుప్రసిద్ధుడు శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు. ఇది ఆయన శత జయంతి సంవత్సరం.