తెలుగు సాహిత్యంలో నూత యుగావిర్భావాన్ని సూచించే వేగుచుక్క గురజాడ అప్పారావు. పంథొమ్మిదో శతాబ్దపు వ్యక్తిని ఇరవై ఒకటో శతాబ్దంలోనూ చెప్పుకుంటున్నామంటే అందుకు కారణాలు అనేకం.
పెరిగి విరిగితి
విరిగి పెరిగితి
కష్టసుఖముల
సారమెరిగితి
కొత్తమిన్కుల
తెలివితేటల
మంచి చెడ్డల
మార్చితిన్! అని స్వయంగా చెప్పుకున్న గురజాడ నిజంగానే సమాజంలో మంచి చెడ్డల గురించి పాతుకుపోయిన అభిప్రాయాలను ప్రశ్నించి సమూలంగా పరిష్కరించేందుకు కలం పట్టాడు.
ఎప్పుడైనా యుగకర్తలైన వారు సాహిత్య ద్రష్టలుగానే గాక సామాజిక ద్రష్టలుగా కూడా వుంటారు. వారి భావనలు కాలరేఖలను దాటి తదుపరి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. వారి మాటలు కొత్త బాటలు వేస్తాయి. గురజాడ అక్షరాలా తెలుగువారి వెలుగుజాడ. గురజాడ అప్పారావు అగ్రస్థానం కేవలం ఏ ఒక్క కోణం నుంచో, ఒక్క కారణం నుంచో లభించింది కాదు.
గురజాడ సనాతన కుటుంబంలో పుటిyనా దైవభ'క్తిని బోధించడానికి పరిమితం కాలేదు. పైగా దైవభావనకు మానవతాపూరితమైన వ్యాఖ్యానం ఇచ్చాడు. తను రాజుగారి కొలువు చేసినా రాజభ'క్తికే పరిమితం కాలేదు. ఈ రెంటినీ మించిన దేశభ'క్తిని చాటి చెప్పాడు. అది కూడా సంకుచితమైన, దురభిమానపూరితమైన దేశభ'క్తి కాదు. ఏ దేశంలోనైనా అనుసరించగల విశ్వజనీనమైన దేశభ'క్తి, ఆ గీతానికి ప్రపంచ జాతీయగీతం కాగల శక్తి వుందని మహాకవి శ్రీశ్రీ అందుకే అంటాడు.
దేశభ'క్తిని బోధించడమే కాదు - దేశం అంటే ఏమిటో కూడా తొలిసారి గురజాడ చెప్పారు. అంతకు ముందు కాలంలో దేశం అంటే నదులు, పర్వతాలు అని కీర్తించే భౌగోళిక దృష్టి మాత్రమే వుంది. లేదా రాజుల విజయాలనే చెప్పే ధోరణి వుంది. గురజాడ ఆ దృక్పథాలను మార్చేశారు. దేశమంటే మట్టికాదు, మనుషులన్నాడు. మనుషులంటే ఎవరనే ప్రశ్న ఆ వెంటనే వచ్చింది. తిండి కలిగితే కండ కలదోరు, కండ కలవాడేను మని'ోరు అన్నాడు. 'మనిషి చేసిన రాతి బొమ్మకు మహిమ కలదని సాగి మొక్కుతు మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగా చూస్తావేల బాలా' అని ప్రశ్నించాడు.
అప్పటిదాకా అంతా రాజులు, మతాధిపతులు, ఆచార్యులు చెప్పినటేy జరిగింది. అలాగాక సామాన్యమైన మనిషిని కేంద్రబిందువుగా చేసుకోవాలన్న దృషిy పునర్వికాసయుగంలో వచ్చింది. మానవతా వాదం అన్నమాటను ఈనాడు మనం మరో అర్ధంలో వాడుతున్నాం గాని అది మొదట వాడుకలోని వచ్చిన సందర్భం అదే. దాన్ని తెలుగునాట శక్తివంతంగా



