Pages

Thursday, March 28, 2013

వికసించిన విద్యుత్తేజం



ప్రభుత్వాలకు పోలీసులుంటారు. ఉసిగొలిపితే చాలు విరుచుకుపడి విరగ్గొడతారు. నిజమే. ఆ బలం చూసుకుని జులం చూపి విర్రవీగిన విరగబడిన వారందరూ ప్రజల ముందు శృంగభంగం పాలయ్యారన్నది అంతకన్నా పెద్ద నిజం.కాని అధికారబలంలో అహంకరించే వారికి, అప్రజాస్వామికంగా హుంకరించేవారికి చరిత్ర చెప్పిన ఈ పాఠాలు చెవికెక్కవు. నిరంతర గుణపాఠాలు తలకెక్కవు. చరిత్ర బుద్ధిమంతులకు దారి చూపిస్తుంది. బుద్ధి హీనులను ఈడ్చుకుపోతుంది అంటారు. తప్పదు. వికసించిన విద్యుత్తేజం ఎంతటి విస్పోటనమై విజృంభిస్తుందో బషీర్‌బాగ్‌ ఆ నాడు చెప్పింది. నాలుగు రోజులుగా వామపక్ష నేతలు సాగిస్తున్న నిరవధిక నిరాహారదీక్షలో పెల్లుబికిన ప్రజాభిమానమూ చాటించింది. అయినా ఆ గ్రహింపు లేని పాలకులు ఆగ్రహం తప్ప అవగాహన కనీసంగా ప్రదర్శించలేకపోయారు. ఖాకీలను ప్రయోగించడం తప్ప కాస్త విజ్ఞతతో స్పందించేందుకు నిరాకరించారు.
నిరాహారదీక్షలు ఎక్కువ రోజులు సాగి ఉద్రిక్తంగా మారితే, దీక్షలో కూచున్న వారి ఆరోగ్యం మరీ క్షీణిస్తే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అదుపులోకి తీసుకోవడం అస్పత్రిలో చేర్పించడం కొత్త కాదు. కాని దానికి ముందు ప్రజాస్వామ్య ప్రక్రియవుంటుంది. ప్రభుత్వం సానుకూలంగా ప్రస్తావనలు చేస్తుంది. శాసనసభలో ముఖ్యమంత్రి వంటి వారు సాధికారికంగా ప్రకటన చేసి ప్రతినిధులను పంపిస్తారు. మధ్యవర్తులైన పెద్దమనుషులతో సంప్రదింపులు జరుపుతారు. సగౌరవంగా ముగింపు పలికేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత పాలక పక్షం

ములాయం ముసలం




రోజుకో సంచలన వ్యాఖ్యతో యుపిఎ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సమాజ్‌ వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ మరిన్ని ఫిరంగులు పేల్చారు. కాంగ్రెస్‌ మోసకారి పార్టీ అని అధికారమే దాని పరమావధి అని విమర్శలు గుప్పించారు. పలుసార్లు మూడవ ఫ్రంట్‌ గురించి మాట్లాడ్డం ద్వారా కొత్త రాజకీయ సమీకరణాలకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వదిలారు. అయితే ఆయన రాజకీయ విన్యాసాలు, పిల్లిమొగ్గల నేపథ్యంలో వెంటనే స్పందించడానికి స్వాగతించడానికి ఎవరూ సిద్ధం కావడం లేదు.
మూడవ ఫ్రంట్‌ గురించి ములాయం మాటలపై అవిశ్వాసం పెరగడానికి ఆయన గత వైఖరే కారణం 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో ఓడిపోయినప్పుడు తిరిగి 2008లో యుపిఎ అణుఒప్పందంపై ఓటింగును ఎదుర్కొన్నప్పుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆఖరి నిముషంలో నిర్ణయాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఇటీవల ఎఫ్‌డిఐల విషయంలోనూ ఆ పార్టీ అలాగే చేసింది. ఇవన్నీ గాక ఈ మధ్యన ఒక సభలో ములాయం బిజెపి నేత ఎల్‌.కె.అద్వానీపై ప్రశంసలు కురిపించడం, బిజెపి గనక తన మూడు మత అజెండాలను వెనక్కు తీసుకుంటే సహకరించవచ్చునని చెప్పడం సందేహాలు పెంచింది.
కేంద్రంలో మూడవ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుందని మార్చి24న ములాయం చేసిన ప్రకటనను కాంగ్రెస్‌ బిజెపి లు తోసిపుచ్చాయి. అయితే ఆయన మాత్రం సుష్మా స్వరాజ్‌, శరద్‌ పవార్‌లతో సహా అనేక మందిని కలుసుకుని హడావుడి చేస్తున్నారు. కర్ణాటకలో జనతాదళ్‌(ఎస్‌)తోనూ మంతనాలు జరుపుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అందరి సహకారం అవసరం గనకే ఆయన ఇన్ని తంటాలు పడుతున్నారనే మాట రాజధాని వర్గాల్లో వినిపిస్తున్నది.యుపి రాజకీయాల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన బిఎస్‌పి నేత మాయావతి కూడా ప్రదాని కావాలన్న కోర్కెను బాహాటంగానే వెలిబుచ్చారు.ఈ ఉభయుల మధ్య పోటీ ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాలను ఎలాటి మలుపులు తిప్పుతుందో ఆ మధ్యన కాంగ్రెస్‌ బిజెపిలు ఎలాటి రాజకీయం నడుపుతాయో చూడవలసిందే. కాకపోతే రాహుల్‌ గాంధీ కూడా పార్లమెంటుకు అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు వస్తే మంచిదని భావిస్తున్నాడనేది ఒక వాదన. దాన్నిబట్టి ఎన్నికలు ముందుగా జరిగే అవకాశం చాలా వుందనే చెప్పాలి.


Wednesday, March 6, 2013

అగ్నియోధునికి అశ్రుతర్పణ



వెనిజులా వేగుచుక్క, ప్రత్యామ్నాయ శక్తుల చైతన్య పతాక హ్యూగో చావేజ్‌ అస్తమయం మాటలకందని విషాదం. నాలుగోసారి దేశాద్యక్షుడుగా అప్రతిహత విజయం సాధించిన ఆ అచంచల యోధ రెండేళ్ల కాన్సర్‌ పోరాటంలో కన్నుమూయడం నమ్మక తప్పని నిజం. ఈ విషాద వార్త దేశాల సరిహద్దులకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రియులు స్వాతంత్రం పిపాసులందరిలోనూ శోకాన్ని రగిలించింది. ఎందుకంటే చావేజ్‌ ఒకానొక చారిత్రిక దశలో దిశా నిర్దేశం చేసిన ధీరుడు, ధీశాలి. సోవియట్‌ విచ్చిన్నానంతరం ప్రజాచైతన్యం ప్రతిఘటన అన్నవి మటుమాయమై పోతాయని ఆశపడిన దుష్టశక్తుల దురాశలను దునుమాడుతూ అతి బలమైన అమెరికా సామ్రాజ్యవాదాన్ని అతి దగ్గర నుంచి సవాలు చేసిన సాహస నేనాని. సమర్థ పాలకుడు.
చిల్లర వ్యాపారంలాటి రంగాల్లో ఇండియా విదేశీ పెట్టుబడులను అనుమతించడం లేదని అగ్రరాజ్యాధినేత ఒబామా పెదవి విరవడం.. ప్రధాని అసమర్థ సాధకుడని, విషాద యోగి అని అమెరికా మీడియా తీసిపారేయడం,, ప్రపంచ కార్పొరేటింగ్‌ సంస్థలు ఇండియా స్థానాన్ని దిగువకు నెట్టడం.. అన్యధా శరణం నాస్తి అన్నట్టు అమెరికా ఆదేశాలను ఆఘమేఘాల మీద అమలు చేసేందుకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆఘమేఘాల మీద పరుగులు పెట్టడం మొన్నటి ముచ్చటే. ఇలాటి ప్రపంచంలో ఒకడు... మన కన్నా చాలా చిన్నదైన దేశపాలకుడు..... అమెరికాకు అతి సమీపస్తుడు..... నిన్నమొన్నటిదాకా అంకుల్‌ శ్యాం పెరటిదొడ్డిగా వారి కీలుబొమ్మలైన సైనిక పాలకుల చేతిలో నలిగిన మెలిగిన చరిత్రకు వారసుడు... ఐరాస సమావేశంలో ఆ అమెరికా అధినేతనే భూతంగా వర్ణించిన ఏకైక నాయకుడు చావేజ్‌. ప్రపంచ బ్యాంకు ఆదేశాల బాటలో దివాళా ఎత్తుతున్న దేశాలకు ప్రత్యామ్నాయం చూపుతూ మరెక్కడా లేనంత వేగంగా తీవ్రంగా ప్రజానుకూల విధానాలు అమలు చేసిన

Friday, March 1, 2013

అరుణారుణ.. త్రిపుర




త్రిపురలో అరుణ పతాక జైత్రయాత్ర అభ్యుదయ శక్తులకు అమితోత్సాహం కలిగించే పరిణామం. అస్థిరతకూ అవకాశవాద రాజకీయాలకు మారుపేరైన ఈశాన్య భారత రాజకీయాల్లో ఒక ఆశా కిరణంలా అరుణ తారలా భాసిస్తున్న త్రిపుర వామపక్ష ప్రభుత్వ విజయం నిజానికి దేశానికే ఒక ఉత్తేజం. కేంద్ర కాంగ్రెస్‌ కుట్రపన్ని వేర్పాటు వాద టియుజెఎస్‌(త్రిపుర ఉపజాతి యువసమితి)తో కలసి సైన్యం సహాయంతో అధికారం కైవశం చేసుకున్న 1988 ఎన్నికలను మినహాయిస్తే ఈ ముప్పై అయిదేళ్లలోనూ సిపిఎం వామపక్ష ఫ్రంట్‌ విజయ పరంపరలు సాధిస్తూనే వుంది. విజయ దుందుభులు మోగిస్తూనే వుంది.ఈ విజయానికి కర్తలు చైతన్య వంతులైన ఆ రాష్ట్ర ప్రజలే. ప్రకృతి పరంగానూ, పాలక వర్గాల కుటిల వ్యూహాల కారణంగానూ, దేశ విద్రోహ శక్తుల కుట్రల కారణంగానూ అనేక సవాళ్లు సంక్లిష్లతలూ ఎదురైనా మొక్కవోని చైతన్యం అది. దాడులు దౌర్జన్యాలూ నిర్బంధాలు నరమేధాలకు చలించని సాహసం అది. అందుకే ఈ విజయోత్సవ సన్నివేశంలో త్రిపుర మహాజనానికి మా జేజేలు. అక్కడ వామపక్ష ప్రభుత్వానికీ సిపిఎం నాయకత్వానికి శ్రేణులకు మా విప్లవాభినందనలు.
అది 1977.కేంద్రంలో తొలిసారి ఇందిరాగాందీ నిరంకుశ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెసేతర జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బెంగాల్‌, తమిళనాడు మినహా అన్నిచోట్లా ఈ రెండు పార్టీల వారే విజయాలు సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ బిజెపిల చుట్టూ తిప్పినట్టే అప్పుడూ రెండు పార్టీల సిద్ధాంతం ముందుకు తెచ్చే ప్రయత్నం ప్రచారం జరిగాయి. అదిగో అలాటి సమయంలో 1977 చివరి తేదీన అంటే డిసెంబరు 31న నూతన భానోదయాన్ని సూచిస్తూ త్రిపుర వామపక్ష సంఘటన అపురూప విజయం సాధించింది.అరవైకి యాభై నాలుగు స్థానాలు గెలుపొందటమే గాక కాంగ్రెస్‌ బిజెపిలకు ఒక్క సీటు లేకుండా చేసింది. దీనికి వెనక త్రిపుర ప్రజల

బడ్జెట్‌ బండారం



అనితర సాధ్యంగా ఎనిమిది కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం చిదంబరానికి ఎందుకు వచ్చిందో యుపిఎ 2 తరపున ఆయన సమర్పించిన ఆఖరి బడ్జెట్‌ తేటతెల్లం చేస్తున్నది. దేశ ఆర్థిక పరిస్థితిపై తానే ఇచ్చిన సర్వేలో పేర్కొన్న సమస్యలు వేటికీ పరిష్కారాలు చూపకపోగా మరింత జటిలం చేసే ఝంఝాటమే ప్రదర్శించారు. నిన్న మా సంపాదకీయంలో చెప్పినట్టు ఆ సర్వే బడ్జెట్‌కు ఉపోద్ఘాతం అనుకుంటే అందులో ఇచ్చిన దుస్సలహాల హాలాహలమే చిదంబర బడ్జెట్‌ సారాంశం. ఈడిగిల బడిన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేసే ఏ ఒక్క నిర్దిష్ట చర్యనైనా ప్రతిపాదించింది లేకపోగా సామాన్య జన వ్యతిరేకమైన వాటిని మాత్రం మహౌత్సాహంగా ప్రకటించారు ఆర్థిక మంత్రి. సబ్సిడీల స్తంభన,కోత వాటిలో భాగమే. కంటితుడుపుగా కాస్త పెంపు చూపిించినా పెరిగిన ధరలతో పోలిస్తే అవి అక్కరకు వచ్చేవి కావు. అమెరికా తదితర దేశాలలో విరుచుకు పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయిటపడ్డామని గొప్పలు పోయిన ఆర్తిక మంత్రి అందుకు రక్షగా నిలిచిన బ్యాంకులు బీమా సంస్థలపైనే వేటు వేసేందుకు సిద్దం కావడం ఒక విడ్డూరం. అవినీతి భాగోతాలకు ఆలవాలమైన బొగ్గు చమురు సహజవాయు రంగాల్లోనే ప్రభుత్వ సంస్థలు నేరుగా ప్రైవేటుతో కలవొచ్చని ప్రతిపాదించడం బంగారు బాతులను అప్పజెప్పడమే. వ్యవసాయం నాలుగు శాతం కూడా అభివృద్ధి సాధించలేని స్తితిలో