Pages

Friday, March 21, 2014

నమో భ..జనసేన



చేగువేరా బొమ్మతో కనిపిస్తారుగనక.. ఆవేశపూరితంగా మాట్లాడతారు గనక.. పవన్‌ కళ్యాణ్‌ ఏదో చేసేస్తారనిఆయన అభిమానులైన లౌకిక ప్రజానీకం భావిస్తే వారందరికీ ఆశాభంగం కలిగిస్తూ తన జనసేనను నరేంద్ర మోడీ భజన సేనగా మార్చేశారు. జెండా తప్ప ఇంకా స్పష్టమైన ఎజెండా కూడా లేని ఈ పార్టీ వ్యవస్థాపకుడితో చర్చలు జరపడం ద్వారా మోడీ కూడా మిత్రుల కోసం ఎంతగా తహతహలాడుతున్నదీ బయిటపెట్టుకున్నారు. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్‌ విభజన జరిగిపోయాక ఎన్నికల ప్రకటన కూడా వెలువడ్డాక నాటకీయంగా తెరమీదకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పేరును జెండాను మాత్రం ఆవిష్కరించి విధానాలు తర్వాత చెబుతామన్నారు. తొలి ప్రసంగంలో కాంగ్రెస్‌ హఠావో దేశ్‌ బచావో అన్నప్పుడు దాని సారాంశం బిజెపి ఉఠావో అన్న చందంగా మారుతుందని అందరికీ ఆర్థం కావడానికి వారం కూడా పట్టలేదు! అన్నగారైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కాంగ్రెస్‌లో లీనం చేయడానికి ఇంచుమించు రెండేళ్లు తీసుకుంటే తమ్ముడు అసలు పూర్తిగా పార్టీని ఏర్పాటు చేయకుండానే కాషాయ సేనతో కలుపుతున్నారు! స్వప్న సుందరి హేమమాలిని నుంచి బుల్లితెర నటీమణి సృతిఇరానీ వరకూ శతృఘ్న సిన్హా నుంచి కోట శ్రీనివాసరావు వరకూ బిజెపిలో కలసిన నటీనటులు వున్నారు గాని పవన్‌ కళ్యాణ్‌ వ్యవహారం మరింత దారుణం. జనాకర్షక పదాడంబరంతో కృత్రిమ ఆగ్రహావేశాలతో యువతను లక్ష్యంగా పెట్టుకుని బయిలుదేరిన ఈ నటుడు నేరుగా వెళ్లి నరేంద్ర మోడి ముందు మోకరిల్లడం ఆ విశ్వాసాన్ని వమ్ము చేయడం తప్ప మరొకటి కాదు. విభజనకు ప్రధానంగా సహకరించిన బిజెపిని ఆ అంశంపైనే ఆశ్రయించడం ఎంత విచిత్రం?
కాంగ్రెస్‌ను ఓడించేందుకు కంకణం కట్టుకోవడం వరకూ ఓకే. కాని అవినీతితో సహా ఎందులోనూ దానికంటే

Thursday, March 6, 2014




ఎట్టకేలకు కిరణ్‌ పార్టీ

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొత్త పార్టీ స్థాపించాలని ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆలస్యంగా తీసుకున్న ఈ నిర్ణయం నాటకీయ మార్పులకు దారితీసే అవకాశం చాలా తక్కువ. పదవిలో వుండగా వున్న బలం వేరు, లేనప్పుడు పరిస్థితి వేరు. నిజానికి ఆయన పదవిలో వున్నప్పుడు కూడా సొంతబలం తక్కువే. పైగా ఇప్పటికే కోస్తా రాయలసీమల్లో వైఎస్సార్‌ పార్టీ ప్రభావం అధికంగా వుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో తమ బలం కూడా పెరిగిందని తెలుగుదేశం వారు చెబుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభావం తెలంగాణలో వుండకపోయినా తక్కినచోట్ల వుంటుందని బిజెపి అంచనాగా వుంది. సిపిఎం సమైక్యత నినాదం ఇచ్చిన సిపిఎం కూడా కొన్ని చోట్ల గట్టిగానే తలపడుతుంది.ఎన్నికల పొత్తు కుదిరితే మరింత ప్రభావం వుంటుంది. ఇన్నిటినీ కాదని కిరణ్‌ పార్టీ పెద్ద ఫలితాలు సాధించే అవకాశం వుండదు. కాని ఓట్ల చీలికకు కారణమై తద్వారా దెబ్బతిన్న కాంగ్రెస్‌కు కొంత మేలు చేయొచ్చు. రెండవది మూడేళ్లుగా అధికారంలో వున్న నేతగా కిరణ్‌ అస్తవ్యస్త పరిస్థితికి జవాబు చెప్పుకోవలసి రావచ్చు. మిగతా వారికి ఆ సమస్య వుండదు. మొత్తంపైన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రాంతంలో బహుముఖ పోటీలకు ఓట్లచీలికకు మాత్రం ఇది దారి తీస్తుంది.

గులాబీ అనిశ్చితి

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై అనిశ్చితి తొలగిపోయింది గాని తెలంగాణా రాష్ట్ర సమితి శ్రేణులలో అనిశ్చితి కొనసాగుతున్నది. కొత్త రాష్ట్ర ఆవిర్భావ తేదీ ఖరారైనప్పటికీ దానికోసం ఉద్యమంలో ముందున్నామనే టిఆర్‌ఎస్‌లో రాజకీయంగానూ ఎన్నికల వ్యూహం పోటీల రీత్యానూ గందరగోళం వుందనే వాస్తవాన్ని ఆ పార్టీ ముఖ్యులు కొందరు అంగీకరిస్తున్నారు. పన్నెండేళ్ల ఉద్యమ ఫలితం లభించినప్పటికీ వుండాల్సిన సంతోషం విశ్వాసం లేవంటే అందుకు కారణం అధినేత వ్యవహార సరళి మాత్రమేనని కొందరు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు.
కాంగ్రెస్‌ విలీనంపై ఎడతెగని వూహాగానాలకు అవకాశమిచ్చింది తమ అద్యక్షుడేనని విలీనం వుండదని ఆయన చెప్పిన తర్వాత కూడా విశ్వసించడానికి లేదని టిఆర్‌ఎస్‌ అత్యున్నత విధాన సంస్థ పొలిట్‌బ్యూరో సభ్యులొకరు ప్రజాశక్తితో చెప్పారు. విలీనం లేదని చెప్పడం ప్రతిపక్ష పాత్ర మరొకరికి దక్కకుండా చేయడానికేనని టిఆర్‌ఎస్‌ విమర్శకులు కొందరు వ్యాఖ్యానించారు. అది నిజం కాకపోయినా రెండు పార్టీల అగ్రనేతలు కలిసి ఏదో గూడుపుఠాని నడిపిస్తున్నారు గనకనే దిగ్విజరు సింగ్‌ వంటివారు ఇప్పటికీ పొత్తు గురించి మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్‌ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్‌తో పొత్తు వుండబోదని అంతర్గత సమావేశంలో తమకు వివరించిన కె.చంద్రశేఖర రావు బహిరంగ వ్యాఖ్యలలో మాత్రం ఆ విధమైన స్పష్టత ఇవ్వలేదన్న మాట నిజమేనని కర్నె ప్రభాకర్‌ ఒక చర్చలో పాల్గొంటూ చెప్పారు. అయితే ఆ అవకాశం దాదాపు లేదనే తాము అనుకుంటున్నామని ఆయన వివరించారు.కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు తమను బెదిరించే ధోరణిలో మాట్లాడ్డం సుహృద్భావాన్ని దెబ్బతీసిందని అయినా ఓర్మి వహించామని ఆయన చెప్పారు. ఇందుకు భిన్నంగా మరో నాయకుడు మాట్లాడుతూ ఏదో ఒక అవగాహన లేకపోతే కాంగ్రెస్‌ నాయకులు అలాటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. జెఎసి నాయకుల్లో కొందరితో కాంగ్రెస్‌ నిరంతర సంబంధాలు పాటిస్తున్నది. టిఆర్‌ఎస్‌ను మళ్లీ దగ్గర చేర్చుకోవద్దని కొందరు స్తానిక కాంగ్రెస్‌ వాదులు కేంద్ర రాష్ట్ర నాయకత్వాలకు వినతిపత్రాలు పంపుతున్నారు.
టిఆర్‌ఎస్‌ ఇంతకాలం ఉద్యమానికి నాయకత్వం వహించి వివిధ శక్తులను కూడగట్టినప్పటికీ పార్టీ యంత్రాంగం గానీ, ఎన్నికల్లో పోటీచేసే శక్తి గాని పెంచుకోలేకపోయిందని దాదాపు ఆ పార్టీలో చాలా మంది అంగీకరిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వలసకు ద్వారాలు తెరవడంలో బలంతో పాటు బలహీనత కూడా వ్యక్తమవుతున్నది. ఇంచుమించు సగం చోట్ల బలమైన అభ్యర్థులు లేరు. అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే వుంటాయి. పైగా ఈ పేరిట బయిటవారినెవరినో ఆహ్వానించడం వల్ల ఎప్పటినుంచో పనిచేసే మా వంటి వారికి అవకాశం లేకుండా పోతుంది. ఈ నిర్ణయాలన్నీ ఎవరు ఖరారు చేస్తారన్నది కూడా తెలియడం లేదు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో వచ్చినట్టే డబ్బులు చేతులు మారుతున్నాయనే భావన మా పార్టీలోనూ కనిపించడం మంచి పరిణామం కాదని టిఆర్‌ఎస్‌ ఆశావహులు అంటున్నారు. సోనియా గాంధీ గనక తెలంగాణా ఏర్పాటు ప్రకటించేందుకు చర్య తీసుకుని వుండకపోతే తమ తరపున ఎవరెవరు పోటీ చేసి వుండేవారో వూహించలేనంత దారుణంగా వుండేదని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. ఉద్యమ పార్టీ నుంచి ఫక్కా రాజకీయ పార్టీగా మారిపోయినట్టు తమ నాయకుడు ప్రకటించాక ఉద్యమాల్లో ముందున్న తమ భవిష్యత్తు సంధిగ్గంలో పడకుండా ఎలా వుంటుందని ఆయన ప్రశ్నించారు.
సిపిఐ,న్యూ డెమోక్రసీలతో సీట్ల సర్దుబాటుకు చర్చలు జరుగుతున్నట్టు టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. కొన్నిసీట్ల గుర్తింపు కూడా జరిగిందని అంటున్నారు. అయితే న్యూ డెమొక్రసీ సూటిగా సర్దుబాటు చేసుకుంటుందా లేక పోటీ నివారణ జరుగుతుందా అనేది చూడాల్సి వుంటుంది. అలాగే మజ్లిస్‌తో టిఆర్‌ఎస్‌ సంబంధాలపై బిజెపి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమతో చేతులు కలిపే అవకాశం వారు పొగొట్టుకుంటారు అని బిజెపి నేత ఒకరు అన్నారు. కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ నిజంగా పోటీ పడి ఓట్లు చీల్చుకుంటే తెలుగుదేశం బిజెపి కూటమికి కొంత మేలు జరుగుతుందనే అంచనాలో వారున్నారు. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో బిజెపి టిడిపిలు, నల్గొండ ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు, ఖమ్మంలో వైసీపీ ప్రభావం కూడా వుంటుందని అన్ని పార్టీలూ అంచనా వేస్తున్నాయి. రాజధాని ఆ పరిసరాలలో ఓటర్ల తీరు మరో విధంగా వుండొచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఏకపక్షంగా దూసుకుపోగల మన్నధీమా టిఆర్‌ఎస్‌లో కనిపించకపోగా ఏం జరుగుతుందన్న దానిపైనా కొంత అనిశ్చితి నెలకొన్నది. తమకు తెలంగాణాలో యాభై సీట్లు వస్తాయని కొందరు 70 వరకూ వస్తాయని మరికొందరు అంచనాలు చెబుతున్నారు.అదే సమయంలో తెలుగుదేశం ఎంఎల్‌ఎలను మీరెప్పుడొస్తారంటే మీరు ఎప్పుడు అని సరదాగానూ నిజంగానూ అడుగుతున్న స్తితి ఆశ్చర్యం కలిగిస్తుంది.

Wednesday, March 5, 2014




్నకల తేదీల ప్రకటన పూర్తయింది గనక ఇక రాజకీయమంతా విభజనపై గాక విజయ సాధనపై నడుస్తుంది. అందుకోసం పార్టీలు తమ తమ విన్యాసాలలో మునిగిపోతాయి. సిపిఐ, న్యూడెమోక్రసీ మజ్లిస్‌లతో ఆ పార్టీ సర్దుబాట్టు చేసుకోవచ్చు. విలీనమై కాంగ్రెస్‌ను బలోపేతం చేయకపోవడం ఒక విధంగా మంచి విషయమే.. తెలుగుదేశం బిజెపితో జట్టు కట్టడం తథ్యం.లోక్‌సత్తా కూడా బిజెపితో కలుస్తుందన్న వార్తలే విచిత్రంగా వున్నాయి. సుపరిపాలన అన్న అంశంపై మోడీని బలపరుస్తామని అ పార్టీ అతి కీలక నేత ఒకరు నాతో అన్నారు. లోక్‌సత్తా పాత్ర చాలా పరిమితమైనా జయప్రకాశ్‌ నారాయణ్‌ కలిగించిన భావనకు ఇది పూర్తి వ్యతిరేకంగా వుంటుంది. బిజెపి నేత మోడీ మంత్రజాలాన్ని సీమాంధ్రలో ప్రధానంగా ప్రయోగించాలని బిజెపి భావిస్తున్నట్టు కనిపిస్తుంది.
కాంగ్రెస్‌ నాయకులు టిఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నామని అంటున్న మాట కేవలం ప్రజలముందు చెప్పుకోవడానికి ఉద్దేశించిందనుకోవాలి. టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో విలీనం లేదని చెప్పడమంటే బహుశా పొత్తు కూడా వుండదనే అర్థం.ఇది కూడా ఎత్తుగడే అని కొందరంటున్నారు గాని అది మరీ అతిశయోక్తి కావచ్చు. ఫలితాల తర్వాత ఏమైనా జరగొచ్చు గాని ఇప్పటికైతే పోటీ తప్పదు.
పిఎం తెలంగాణాలో పొత్తుల విషయం ఇంకా ఏ అభిప్రాయానికి వచ్చినట్టు కనిపించదు. సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌ పార్టీతో పొత్తు విషయం కూడా పరిశీలనలో వుందని తుది నిర్ణయం కేంద్ర కమిటీ తీసుకుంటుందని లోగడ బి.వి.రాఘవులు చెప్పారు. ఇటీవల కేంద్ర కమిటీ ముగిసింది. రాష్ట్ర కమిటీ 8 వతేదీన సమావేశం కాబోతుంది. తుది నిర్ణయం అప్పుడు వెలువడవచ్చు.
మొత్తంపైన సీమాంధ్రలో కన్నా తెలంగాణాలో పార్టీల పోరాటం, ఓట్ల విభజన ఎక్కువగా వుంటుంది. కమ్యూనిస్టులకు కూడా ఇక్కడ బలమైన కేంద్రాలున్నాయి. ,కాంగ్రెస్‌ రాష్ట్రం ఏర్పాటు చేసింది తామేనని చెప్పుకుంటే బిజెపి, బలపర్చానంటుంది. తెలుగుదేశం దానితో పొత్తు పెట్టుకుని తన యంత్రాంగాన్ని రంగంలో దించుతుంది. అయితే ఆ పార్టీ వారు అనేకమంది టిఆర్‌ఎస్‌లోకి వలసలు రావడం దాని పరిస్థితిని తెలియజేస్తుంది.చంద్రబాబు నాయుడు లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారంలో అంతర్గతంగా అవసరమైతే కేంద్రానికి వెళ్లవచ్చన్న సంకేతం కనిపిస్తుంది. చివరకు ఏది ఏమయ్యేది చూడాల్సిందే.
జూన్‌2న ఆవిర్భావ తేదీ ప్రకటించారు గనక ఈ ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్‌కు ఆఖరి ఎన్నికలు. ఇవి సజావుగా ఏర్పడేబోయే రాష్ట్రాల అభివృద్ధి ప్రజా శ్రేయస్సు లక్ష్యాలుగా జరిగితే చాలా మంచిది. ఇంకా ఉద్రేకాలు పెంచుకుంటే అంతకన్నా పొరబాటుండదు.
ఇతర రాష్ట్రాలలో ఎన్నికలపై మరోసారి.

watch Telangana choupal on cnnibn site

Monday, March 3, 2014

ఊహించిన మలుపు






టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయబోవడం లేదని కె.చంద్రశేఖర రావు చేసిన ప్రకటన గత కొద్ది రోజులుగా వస్తున్న కథనాలకు అనుగుణంగానే వుంది. గత వారమంతా చర్చల్లో అదే చెబుతూ వచ్చాను. కెసిఆర్‌ సకుటుంబంగా సోనియా గాంధీని కలిసిన రోజు వరకూ కూడా విలీనంపై విస్పష్టమైన ప్రకటన గాని సూచనలు గాని చేయకుండా జాగ్రత్త పడ్డారు. దీనిపై మా వంటి వారి అభిప్రాయాలు కూడా ఆ కారణంగానే మార్చుకోవడం కూడా సంభవించింది. ఇప్పుడు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌కు దిమ్మ తిరిగేలా చేసిందంటున్నారు గాని అందుకు వారు సిద్ధమైనట్టే కనిపిస్తుంది.కాంగ్రెస్‌ ఇప్పటికే దారుణంగా దెబ్బతినిపోయి వుంది గనక ఏ మాత్రం మేలు జరిగినా లాభం కింద లెక్కవేసుకునే పరిస్థితి. టిఆర్‌ఎస్‌ విలీనం కాకుండా విడిగా వుండటాన్ని బహుళపక్ష ప్రజాస్వామ్యం కోరేవారు సాధారణంగా ఆహ్వానిస్తారు. అయితే అస్తిత్వం నిలబెట్టుకోవాలని చేసిన ఈ నిర్ణయం గొప్ప వ్యూహాత్మక దెబ్బ అని చెప్పడం కూడా అతిశయోక్తి అవుతుంది. విలీనం వద్దే వద్దనుకుంటే ఇంతకాలం తమ శ్రేణులను కూడా అనిశ్చితికి గురి చేయడమెందుకు? టిఆర్‌ఎస్‌ ఉప ఎన్నికలలో తప్ప మరే సందర్భంలోనూ గొప్ప బలనిరూపణ చేసుకున్నది లేదు. ఇప్పటి స్థితి ఏమిటో భవిష్యత్తు చెప్పాలి. పొత్తులపై కమిటీ అంటూనే ఏమి ఆలోచిస్తున్నది చెప్పకుండా దాటవేశారు ఇక ముందు కూడా వూహాగానాలు కొనసాగడం, వూగిసలాటలు కనిపించడం అనివార్యం. పొత్తులకు ప్రాతిపదిక ఏమిటనేది కూడా చెప్పలేదు గనక ఇది ఎప్పుడు ఎలాగైనా వుండొచ్చన్న మాట. చివరి నిముషం ప్రకటనలతో మలుపులతో కిక్‌ వుండొచ్చేమో గాని ప్రజలకు పార్టీ కార్యకర్తలకు మాత్రం అయోమయం వుంటుందని కెసిఆర్‌ గ్రహిస్తున్నట్టు కనిపించదు. తమ కారణంగానే తెలంగాణా ఏర్పడిందని చెప్పుకునే అవకాశం ఇక్కడ, టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్నది మేమేనని అక్కడ ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్‌ వ్యూహ రచన చేయొచ్చు. తెలంగాణా వరకైనా దీని ప్రభావం ఎంత వుంటుందనేది చూడాల్సిన విషయం.