Pages

Sunday, November 25, 2012

విలాపమూ, వివాదమూ!




కన్నీళ్లు మనుషులను బతికించగలిగితే అమృతం లాగే అవీ ఎప్పుడో అరుదై పోయివుండేవంటాడు ఆత్రేయ ఒక సినిమాలో. నా కోసం ఏడవకుండి మీ కోసం మీ బిడ్డల కోసం ఏడవండి అంటాడు కరుణామయుడు! కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడైనా కదిలించాల్సిన విషయమే. అందులోనూ ప్రజా ప్రతనిధులుగా ప్రముఖ నేతలుగా చక్రం తిప్పిన వారు కన్నీరు మున్నీరవడం అసాధారణం.తెలుగు దేశం అగ్గిబరాటాల్లో ఒకరైన పయ్యావుల కేశవ్‌ తను వలస వెళ్తానంటూ వస్తున్న వార్తలపై మనస్తాపం చెంది మీడియా ముందు విలపించిన తీరు ఆ రీత్యా ఎవరికైనా సానుభూతినే కలిగించాలి.అయితే కేశవ్‌ ఏ పార్టీలోకి వెళ్తాడన్న వార్త ఈ సన్నివేశానికి కారణమైందో ఆ పార్టీ ముఖ్యుడైన శ్రీకాంత్‌ రెడ్డి ఈ అశ్రువులను అవహేళన చేస్తూ మాట్లాడారు.అది ఆయన సంస్కారానికి నిదర్శనమని కేశవ్‌ స్పందించారు. రాష్ట్రంలో రాజకీయాలు ఎలా వున్నాయంటే ఆ విలాపం కూడా వివాద గ్రస్తమవుతున్నది.ఏమైనా ఇది ఈ ఇద్దరికే పరిమితమైన వివాదం కాదు.
ఆయారాం గయారాంల సంసృతి ఈ దేశానికీ, రాష్ట్రానికీ కూడా కొత్తకాదు. అయితే వైఎస్‌రాజశేఖర రెడ్డి దుర్మరణం, జగన్‌ వారసత్వ సమరం, తర్వాత స్వంత కుంపటి పెట్టుకోవడం నేపథ్యంలో వలసల వరుస కాస్త విచిత్రంగా వున్నమాట నిజం. అధినేత ఆరోపణలు దర్యాప్తులతో జైలులో వున్నా పార్టీ మాత్రం ఎన్నికల విజయాలు సాధిస్తూ ఇతర పార్టీల ప్రతినిధులను ఆకర్షించడం గతంలో చూడని పరిణామం. ఇందుకు దోహదం చేస్తున్న కారణాలేమిటన్నది లోతుగా అధ్యయనం చేయవలసిన అంశం. అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదని కొందరు తేలిగ్గా అంటుంటారు . సామాజిక పొందికలను బట్టి మరికొందరు విశ్లేషిస్తుంటారు. ఇవన్నీ పాక్షికమైన భావనలే. జగన్‌, ఆయన పార్టీ బలంగా ఆవిర్భవించడం వెనక అనేక శక్తుల ప్రోత్సాహంతో పాటు తెలుగు దేశం ప్రదర్శించిన ఉపేక్షాభావం కూడా వుంది. జగన్‌ తిరుగుబాటు కాంగ్రెస్‌ను బలహీనపరుస్తుందనే అంచనాతో ఆ పార్టీ చూచీ చూడనట్టు వ్వవహరించింది. కాని జగన్‌ బలం పుంజుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి సంపాదించుకున్నప్పుడు ఆ పనిచేస్తే అతను బలపడతాడన్న కారణంగా తటపటాయించింది.ఈ జంజాటంలో జగన్‌ వర్గం వ్యూహాలకు పదును పెట్టుకుని శక్తి పెంచుకుందనేది వాస్తవం. ఆయనకూ

మన సినిమాల్లో కులమతాలు






దేనికైనా రెడీ చిత్రానికి సంబంధించి ఇటీవల తీవ్రమైన వివాదమే నడిచింది. మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు చిత్రాన్ని పరిశీలించిన ఉన్నత స్థాయి కమిటీ అందులో ఒక కులాన్ని కించపర్చే దృశ్యాలు ఇప్పుడు లేవని గౌరవించే అంశాలూ వున్నాయని పేర్కొంది. అయినా ఆ చిత్ర నిర్మాత మోహన్‌బాబుపై మరో కేసుకోసం ప్రయత్నం సాగుతున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఈ సందర్భంలో ఇంటిముందు ధర్నా చేసేందుకు వచ్చిన వారిపై దాడి జరగడం కూడా విమర్శలకు గురైంది. ఈ ఉదంతం తర్వాత చిత్రాలలో పాత్రల పరిధి, కళా స్వేచ్చ సామాజిక సమతుల్యత వంటి విషయాలు మరోసారి చర్చనీయమైనాయి. కుల మతాలు అధికంగా వుండటమే గాక వాటి చుట్టూ రకరకాల రాజకీయాలు అవాంఛనీయ భావాలు కూడా అధికంగా వుండే ఈ దేశంలో ఇలా జరగగడం అర్థం చేసుకోదగిందే.
ప్రస్తుత వివాదాన్ని పక్కనపెట్టి అసలు సినిమాల్లో కుల మతాల చిత్రణ విషయానికి వస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.
సినిమా రంగంలో కుల తత్వం అధికమనీ ఒక కులం వారికే అవకాశాలు ఎక్కువనీ ప్రచారం ఎప్పుడూ సాగుతుంటుంది. సమాజంలో వున్న పరిస్థితులు ప్రాబల్యాలే సినిమా రంగంలోనూ గోచరిస్తాయి తప్ప ప్రత్యేకంగా ఏవో సూత్రాలు వుంటాయనుకోవడం అవాస్తవికం. కళాత్మక విలువల కోణంలో చూడాల్సిన విషయాలను కులాత్మకంగా చూడటమే ఒక దౌర్చల్యం. తెలుగు సినిమాలనే తీసుకుంటే మొదటి గొప్ప దర్శకుడు హెచ్‌ఎంరెడ్డి. మొదటి పెద్ద హీరో చిత్తూరు నాగయ్య! తర్వాత కాలంలోనూ ఈ సామాజిక పొందికలు కొనసాగాయి. వివిధ సామాజిక పరిణామాలు సంస్కరణోద్యమాల తర్వాత ఇతర తరగతులు కూడా అభివృద్ధి చెందిన కొద్ది సినిమా రంగంలో స్థానం సంపాదించగలిగాయి. అంతే తప్ప సినిమా రంగంలో కేవలం కులం బట్టి ఆదరించడం నిరాదరించడం అరుదు.ఎవరి ప్రతిభనైనా ఉపయోగించుకుని సొమ్ము చేసుకోవడమే అక్కడ ప్రధాన నీతి! రంగాల వారీగా నటన, రచన, సంగీతం వంటి వాటిని తీసుకుంటే కూడా ఈ సామాజిక విభజన కనిపిస్తుంది.
తెర వెనక విషయాలు ఏమైనా తెలుగు తెరపై కుల ప్రస్తావనలు చాలా తక్కువగానే వుంటాయి. సనాతనులు, దళితులు, వృత్తి చేసుకునే వారు, పెత్తందార్లు ఇలాటి సందర్భాల్లోనే చెప్పనవసరం లేకుండా వాతావరణాన్ని పేర్లను బట్టి కులాలు తెలిసిపోతుంటాయి. సూటిగా చెప్పాలంటే నిచ్చెన మెట్ల వ్యవస్థలోని అత్యగ్ర, అతి దిగువ

Monday, November 19, 2012

తెలుగు భాషా వికాసం: వాస్తవిక దృక్పథం




ఇటీవలి కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణ అన్న నినాదం ఎక్కువగా వినిపిస్తున్నది. ఈ పేరుతో అనేక వేదికలు సంస్థలు నెలకొన్నాయి. అధికార అనధికార ప్రముఖులు ముందుండి కార్యక్రమాలు నడిపిస్తున్నారు. తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమాలని పిలుస్తున్నారు.కొన్నేండ్ల కిందట తమిళ భాషకు ప్రాచీన హౌదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం తెలుగును నిర్లక్ష్యం చేసిందని నిరసనలు మార్మోగాయి. ఎట్టకేలకు ఆలస్యంగానైనా ఆ హౌదా తెలుగుకూ ఇచ్చారు గాని తర్వాత దానివల్ల ఒరిగిందీ జరిగిందీ ఏమిటనేది ఇంకా అస్పష్టంగానే వుంది. డిసెంబర్‌ నెలలో తిరుపతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు తలపెట్టడం, ఇటీవలనే అధికార భాషా సంఘం అద్యక్షుడుగా మండలి బుద్ధ ప్రసాద్‌ను నియమించడం వంటి పరిణామాలు ఈ అంశపై ఆసక్తి పెంచాయి.
ఇంతకూ తెలుగు భాషను కాపాడుకోవడమంటే ఏమిటి? ఎవరి నుంచి? ఏ విధంగా? ఇప్పుడు మమ్మీ డాడీ చదువుల నుంచి అని టక్కున జవాబు చెప్పేస్తారు. నిజానికి ఈ సమాధానం సమగ్రమైంది కాదు. ఎందుకంటే ఇలాటి ప్రశ్నలకు ఒక్కొక్క దశలో ఒక్కొక్క జవాబు వుంటూ వచ్చింది. ఇంగ్లీషు నుంచి మాత్రమే గాక సనాతనవాదుల నుంచి సంసృత వ్యామోహం నుంచి తెలుగును కాపాడుకోవడం ఒకనాడు పెద్ద ఉద్యమంగా సాగింది. నిజానికి తెలుగు కోసం పోరాటం సంస్కరణోద్యమంలో పెద్ద భాగం. మా వాళ్లకుతెలుగులో రాయడమంటే చులకన అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వయానా రాసిన మాట. గురజాడ మరింత సూటిగానే చెబుతారు: ' విశాల ప్రజానీకం చదువుకోవడం పూర్వాచార సంప్రదాయంలో భాగం కాదు. నాడు జ్ఞానార్జన సాహిత్యం బ్రాహ్మణుని గుత్తసొమ్ము. అతని దృష్టిలో సంసృతం పెట్టిన వరవడి పవిత్రమైనదీ, మీరరానిదీ సంసృత సాహిత్యం క్షీణ దశలో వున్నప్పుడు తెలుగు సాహిత్య సృష్టి ప్రారంభమైనందున ఆ క్షీణ దశ లక్షణాలైన బాషా కళా సంప్రదాయాలు తెలుగులో పాతుకు పోయాయి. రాజకీయ రంగంలో లాగానే భాషా రంగంలో కూడా వేర్పాటు తత్వమూ ప్రభువర్గ తత్వమూ చివరకు పతనోన్ముఖం కాక తప్పదు.అనేకుల అవసరాలు కొద్దిమంది వాటికన్నా ముఖ్యమైనవి. తుదకు వాటిదే పై చేయి అయి తీరుతుంది''
ఇంత స్పష్టతతో గురజాడ గిడుగు సాగించిన వాడుక భాషా పోరాటం కేవలం భావోద్వేగ సంబంధమైంది కాదు. మాతృభాష అందులోనూ ప్రజల భాషను పెంపొందించుకోవడం ఒక ప్రజాస్వామిక అవసరం. అయితే ఆంగ్లేయులు పాలించడం వల్ల తర్వాత ప్రపంచాధిపత్యం సాగిస్తున్న అమెరికాలో మాట్లాడేది కూడా ఆ భాషే కావడం వల్ల(అయితే వారి ఆధిపత్యం కారణంగా అమెరికన్‌ ఇంగ్లీషు!) తెలుగుతో సహా వందలాది దేశ భాషలు కునారిల్లిపోవలసి

ఏక్‌ థా హిట్లర్‌




'' నేను హిట్లర్‌కు గొప్ప ఆరాధకుణ్ణి. అలా చెప్పడానికి నేనేమీ సిగ్గుపడటం లేదు.ఆయన పద్ధతులన్నిటితో నేను ఏకీభవించలేకపోవచ్చు గాని ఆయన అద్భుతమైన నిర్మాణ దక్షుడూ, మహౌపన్యాసకుడు. మాకిద్దరికీ చాలా ఉమ్మడి లక్షణాలున్నాయని నేననుకుంటాను.'' ఆసియా వీక్‌ ఇంటర్వ్యూలో బాల్‌ థాకరే.

బాల్‌ థాకరే మరణవార్తతో పాటు చాలా పత్రికలు ఛానెళ్లు ఇచ్చిన శీర్షిక 'ఏక్‌ థా టైగర్‌'. ఒక హిందీ సినిమా టైటిల్‌. టైగర్‌ అంటే పులి గనక బాల్‌ థాకరే రాజకీయం కూడా మతతత్వం మాఫియాల పులిజూదం లాటిదే. ఈ రాజకీయజూదంలో ఫణం పెట్టిందీ,బలిగొన్నదీ వేలాది మంది అమాయకులు ప్రాణాలు. మత మాఫియా తత్వాలు అన్ని రకాల దురభిమానాలు ఈ రాజకీయ ద్యూతంలో పాచికలు వాటన్నిటికీ ఆద్యుడైన హిట్లర్‌కు అసలు సిసలు ప్రతిరూపం ధాక్‌రే. తనకు తానుగా ఆ భక్తి ప్రపత్తులను బయిటపెట్టుకున్న వ్యక్తి. రాజకీయాల్లో ఆయన ప్రాబల్యం పట్టు గురించి మాత్రమే చెప్పి అందుకు సాధనంగా చేసుకున్న విధానాలను విస్మరించడం అవాస్తవికత అవుతుంది. పునర్వికాసం అనే పత్రిక నడిపిన రచయిత భాషా రాష్ట్ర ఉద్యమకారుడు కెఎస్‌థాకరే కుమారుడైన బాల్‌ థాకరే తండ్రి నుంచి స్పూర్తి పొందినా కొద్ది కాలంలోనే నాజీ హిట్లర్‌ బాట పట్టాడు. మొదట్లో ఆయనకు ఆరెస్సెస్‌తో సంబంధం వుండేది. ముంబైలోని ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌లో కొంత కాలం కార్టూనిస్టుగా పనిచేసిన థాకరే యాజమాన్యంతో విభేదించి మార్మిక్‌ అనే పేర స్వంత పత్రిక ప్రారంభించాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత స్థాపించిన సామ్నా పత్రికకే ఎక్కువ ప్రచారం లభించి ఆయన వాణిగా మారింది.
మరాఠీ దురభిమానం...
ముంబాయిలో కాంగ్రెస్‌, సోషలిస్టు సంప్రదాయాలు, కమ్యూనిస్టు కార్మిక సంఘాలు వున్నప్పటికీ ధాకరే మాత్రం మరాఠీ దురభిమానం రెచ్చగొట్టడమే మొదటి నుంచి తన విధానంగా చేసుకున్నాడు. 1960లలో నిరుద్యోగం తాండవిస్తుంటే ఆయన ప్రభుత్వ విధానాలను ఖండించే బదులు భూమి పుత్రుల సిద్ధాంతం ముందుకు తెచ్చి మరాఠీయేతరులే కారణమంటూ వారిపై దాడులకు

Thursday, November 15, 2012

మజ్లిస్‌ మతలబులు- పరివార్‌ పాచికలు



అస్థిరత్వంతో అస్తుబిస్తుగా నెట్టుకొస్తున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకోవాలని మజ్లిస్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని తీవ్రం చేస్తింది. బొమ్మ బొరుసులాటి బిజెపి మజ్లిస్‌ ల పోటాపోటీ రాజకీయ వ్యూహాల ఫలితంగా రాజధాని నగరం ఎప్పటికప్పుడు ఉద్రిక్తతల మధ్య అందోళనగా గడపాల్సిన స్థితి. దీపావళి సంబరాలకు బదులు అప్రకటిత కర్ఫ్యూ నీడలు దట్టంగా పర్చుకున్న దురవస్థ. చారిత్రాత్మక చార్మినార్‌ను కూడా వదలని మత రాజకీయాల నేపథ్యంలో వెలువడిన ఈ నిర్ణయం మతలబులేమిటో మజ్లిస్‌ నేతలకే తెలియాలి. అయితే పరిస్థితిని ఈ దశకు తెచ్చింది మాత్రం సంఘ పరివార్‌ రాజకీయాలు, అందుకు వత్తాసుగా ఉపయోగపడిన రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాలే అనిచెప్పాలి. ఈ తాజా ఘటనలోనూ శాశ్వత కట్టడాలు నిర్మించరాదన్న కోర్టు ఉత్తర్వులు ఒక వైపు, యధాతథ స్థితి కాపాడాలన్న ఉత్తర్వులు మరో వైపు వుండగా మతతత్వ శక్తులు వాటికి రకరకాల భాష్యాలు చెబుతూ ఉద్రిక్తతలు రగిలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వుదాశీనత వహించింది. పరిస్థితి పరాకాష్టకు వచ్చే వరకూ అనుమతించింది. దేవాలయ పరిరక్షణ సమితి పేరిట ప్రచురించిన కరపత్రంలోనూ అక్కడ చేసిన ప్రసంగాలలోనూ సంఘ పరివార్‌ బిజెపిల ప్రతినిధులు ఇష్టానుసారం మాట్లాడి మతభావాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా ఈ సంక్షోభాన్ని మద్దతు ఉపసంహరణతో ముడివేయడంలో మజ్లిస్‌ నేతల ప్రచ్చన్న అజెండాలు ఏమిటన్న చర్చలు ప్రతిచోటా సాగుతున్నాయి. ఆ తర్వాత క్రమేణా ముస్లిం మైనారిటీలను సమీకరించి రాజకీయ ఒత్తిడిపెంచేందుకు మజ్లిస్‌ నాయకత్వం పెద్దఎత్తునే పాచికలు వేస్తున్నది. కాంగ్రెస్‌ నేతలు కొందరు బుజ్జగింపుగానూ మరికొందరు దాడి చేస్తూనూ అయోమయాన్ని ప్రతిబింబిస్తున్నారు.
చారిత్రికంగా చూస్తే 1978 తర్వాత మజ్లిస్‌ రకరకాల ఎత్తుగడలు మార్చి కాంగ్రెస్‌ అండదండలతో ప్రయోజనాలు సాధించుకోవడం రివాజుగా చేసుకుంది. 1980లలోనూ, 1990లోనూ కూడా

Wednesday, November 14, 2012

వ్యాఖ్యల్లో వాస్తవాలు, రాజకీయ రాద్ధాంతాలు



ఇటీవలి కాలంలో కొంతమంది ప్రముఖుల వ్యాఖ్యానాలపైన, కొన్ని సినిమాల పైన తీవ్ర దుమారం చెలరేగింది.కొన్ని అంశాలు వాదోపవాదాలకే పరిమితమైతే మరికొన్ని తీవ్ర ఘర్షణలకూ వరకూ వెళ్లాయి. ఇందులో ఏది ఎంత వరకూ సరైంది అనే సమస్య ఒకటైతే అసలు ఈ వివాదాలకు నిజంగా అంత ప్రాధాన్యత వుందా లేక నిరర్థక తతంగాలానే అనే పరిశీలన మరొకటి.
వివేకానందుడు దావూద్‌ ఇబ్రహీంలు ఒకే విధమైన మనస్తత్వం కలిగివున్నారంటూ బిజెపి అద్యక్షుడు నితిన్‌ గడ్కరీ చేసిన వ్యాఖ్య, రాముడు మంచి భర్త కాదంటూ అదే పార్టీకి చెందిన రాం జెత్మలానీ వ్యాఖ్య,రవీంద్ర నాథ టాగూరు పెద్ద గొప్పవాడేమీ కాదన్న గిరీష్‌ కర్నాడ్‌ వ్యాఖ్య, గ్రామీణ స్త్రీలు ఆకర్షనీయమైన వారు కాదన్న ములాయం సింగ్‌ యాదవ్‌ వ్యాఖ్య, ఆరెస్సెస్‌ కార్యకర్తలు చాలా అంకిత భావం కలిగిన వారన్న కాంగ్రెస్‌ ఎంపి వ్యాఖ్య ఇవన్నీ వివాదాస్పదంగా మారాయి.
అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నితిన్‌ గడ్కరీ ఏం చెప్పినప్పటికీ వివేకానందుడిని దావూద్‌ ఇబ్రహీంతో పోల్టడం దారుణం. వాస్తవానికి సంఘ పరివార్‌ తన మతతత్వ ప్రచారానికి వాడుకోవడమే ఒక వైపరీత్యం. హిందూ మతానికి సేవా ధర్మం కావాలని, సనాతన ఛాయల్లోనే కాలం

Thursday, November 8, 2012

వీర నరసింహగా కెసిఆర్‌




ఇక నరసింహావతారమేనని టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్ర శేఖర రావు ప్రకటించారు. కాంగ్రెస్‌ మోసం చేసిందని, ఇక నమ్మేది లేదని చెప్పేశారు. ఈ బ్లాగు/ఫేస్‌ బుక్‌ ఎంట్రీలు చదివేవారికి ఆయన మాటల డొల్లతనం ఎప్పుడో అర్థమై వుండాలి. కాంగ్రెస్‌ కన్నా మించి పోయి తెలంగాణా ఏర్పాటు తేదీలు ప్రకటించిన కెసిఆర్‌ అందుకు ఆవగింజంతైనా పశ్చాత్తాప పడింది లేదు. అ దే కోవలో ఇప్పుడు చెప్పిందే ఆఖరి వాక్యమనీ అనుకోరాదు. కాకపోతే రాజకీయంగా బలం పెంచుకోవడానికి వంటరిగా నిలదొక్కుకోవడానికి 100 సీట్లు తెచ్చుకోవడమనే పల్లవి ఎత్తుకున్నారు. ఇప్పుడు ఇతర పార్టీలతో సంబంధాలు జెఎసితో అనుబంధాలు తదితర అనేక అంశాలు చిక్కుముడులుగా వున్నాయి. అ న్నిటినీ మించి తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌ పార్టీ వంటి ప్రధాన పార్టీలు పాద యాత్రలతో ప్రచారం చేసుకుంటుంటే మన స్థితి ఏమిటన్న ప్రశ్నలు వచ్చాయి. వీటన్నిటికీ సమాధానం ఇవ్వడంతో పాటు సంక్ష్ఞభాన్ని సానుకూలంగా మార్చుకోవడానికే కె.సిఆర్‌ తనదైన శైలిలో కొత్త అవతారమెత్తుతున్నారు. ణరదాకోసం చెప్పాలంటే- ఇప్పటికే ఒక నరసింహం రాజ్‌భవన్‌లో మకాం చేసి వుండగా మరో రాజకీయ నరసింహం అవసరమా, అద్యక్షా?

వినోదంలో వికృత వివాదం



రాంబాంబులు రాజకీయాలు అంటూ సినిమాలకు సంబంధించిన వివాదాలపై లోగడ చర్చించాము. ఆ తర్వాత కాలంలో దేనికైనా రెడీలో బ్రాహ్మణులను అవమానించారంటూ మరో దుమారం రేగింది. ఇది మోహన్‌ బాబు ఇంటిముందు ధర్నా, వారిపై దౌర్జన్యం వంటి సంఘటనలకు దారి తీసింది.కులాల కుమ్ములాటగా మారింది. నిజంగా ఏదైనా సినిమాలో ఎవరికైనా కష్టం కలిగితే సంబంధిత అధికారులను ఇక్కడ సెన్సార్‌ బోర్డుకు వెళ్లాలి. పైగా ఏదైనా సినిమాలో ఒక కులానికి చెందిన పాత్రలను చూపించితే అవమానంగా భావించడం అవసరమా అన్న ప్రశ్న కూడా వస్తుంది. కథను బట్టి లేదా తీసే వారి సంస్కారాన్ని బట్టి పరిపరివిధాల పాత్రలు పెడుతుంటారు. నౌచిత్యాలు కూడా వుండొచ్చు. ్‌ెూహన్‌ బాబు గత చిత్రాలలోనూ తమను తక్కువగా చూపించారని బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదుకు ఆధారాలుండొచ్చు. అ ది కథకు అవసరమా కాదా అన్నది అసలు ప్రశ్న. ఏదైనా కులానికి చెందిన పాత్రను లేదా బృందాన్ని ఎగతాళిగా చిత్రిస్తే బాధ కలగొచ్చు గాని ఆ పేరిట అడ్డుకోవడం మొదలెడితే ఆగేదెక్కడీ చారిత్రికంగా చూస్తే శ్రీనాథుడు కాశీఖండములో చిత్రించిన గుణనిధి, తెనాలి రామకృష్ణుని పాండురంగ మహత్యములో నిగమశర్మ బ్రాహ్మణపాత్రలైనా చాలా హీన గుణాలతో వుంటాయి. జుురి వారిని ఏమనాలి? ఎందుకనాలి? సమర సింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి ఇలా ఒకే విధమైన పేర్లే వస్తున్నాయంటే నరసింహనాయుడు అని పె ట్టారు.అయితే వొరిగిందేమిటి? తరిగిందేమిటి? వినోదానికి(కొన్నిసార్లు వికారానికి కూడా) ఉద్దేశించిన సినిమాలపై వివాదాలు పెంచుకుని దాడులు దౌర్జన్యాల వరకూ రావడం అర్థరహితం. ఆలస్యంగా రంగ ప్రవేశం చేసిన పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు కూడా శాంతియుత పరిష్కారం కోసం చొరవ తీసుకోవడం మంచిదే.ఇక ముందైనా ఇలాటి నిరర్థక వివాదాలతో కాలం వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తపడాలి.

మదగజాల గిజగిజ!





దేశాన్ని పాలించే హక్కు తమదేనని హుంకరించే రెండు ప్రధాన పార్టీల దురవస్థ దాచేస్తే దాగని సత్యంలా గోచరిస్తోంది. స్వాతంత్ర సాధనతో సహా అన్నీ తమ ఖాతాలో వేసుకుని ఆ పైన దానికి ఎసరు పెట్టే ఆర్థిక విధానాలనూ వాటిలో భాగమైన అవినీతి అక్రమాలనూ ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ గిజగిజ ఒకటైతే విలక్షణ కమలదళం కటకట మరొకటి. రెండూ స్వయం కృతాపరాధాలే. దేశం ధ్యాస లేని అధికార దాహాలే. ఆ పైన ఒకరికి మతతత్వం అదనపు భుజకీర్తి. దేశ రాజకీయాలనూ ఈ రెంటి మధ్యనే చూపించే దేశ విదేశీ కార్పొరేట్‌ ప్రభువులు వారి మీడియా ఇదంతా చూసి ఆనంద నృత్యం చేస్తున్నారు. ఈ సంక్షుభిత పక్షాల నుంచి గరిష్ట ప్రయోజనం పొందేదెలా అని పొంచికూచున్నాయి. దింపుడు కళ్లం అశచావని వృద్ధ జంబూకాల నుంచి నీరసపు వారసత్వాల యువ రాజుల వరకూ ఈ రంగస్థలంపై దర్శనమిస్తున్నారు.
ఏది ఎలా పోయినా అధికార పక్షం గనక ముందు కాంగ్రెస్‌ వ్యవహారం. వెన్నాడే అస్థిరత్వం వదలని ఓటమి భయం మధ్య రాహుల్‌ రాజకీయ నాయకత్వాన్ని స్థిరపర్చాలన్నదొక్కటే సోనియా గాంధీ ఏకైక ఆశ, ఆశయం. ప్రధాని పీఠాన్ని విశ్వసనీయ విశ్వీకరణ ఆర్థిక వేత్తకు అప్పగించి అందుకు సమయం కోసం నిరీక్షిస్తుంటే కథ అడ ్డం తిరుగుతున్న దృశ్యం. వరుస కుంభకోణాలు అతలాకుతలం చేస్తుంటే- అధిక భారాలను ఆఖరుకు భాగస్వామ్య పక్షాలూ సహించలేక వీడ్కోలు పలికి నిష్క్రమిస్తుంటే పేకమేడలా మారిన యుపిఎ 2. అస్తుబిస్తుగా