Pages

Saturday, October 29, 2011

రాజు బూజు ఘనం! రాష్ట్ర ఏర్పాటు ద్రోహం!!



తెలంగాణా పేరిట నాటి నిజాం రాజు నిరంకుశత్వాన్ని ఈనాటి కార్పొరేట్‌ రాజకీయాన్ని కూడా సమర్థించడం ద్వారా టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర రావు గతాన్ని వర్తమానాన్ని కూడా గందరగోళ పరచేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం నాడు ఆయన పోలవరం టెండర్లపై పత్రికాగోష్టిలో చేసిన వ్యాఖ్యలు, అదే రోజు సాయింత్రం ఒక పుస్తకావిష్కరణ సభలో వెలిబుచ్చిన భావాలు ఆ దిశలోనే వున్నాయి.

తెలంగాణా సంసృతి, చరిత్రల గురించి పదే పదే ప్రస్తావించే కెసిఆర్‌ వంటి వారు ఆ చరిత్రను ఆజరామరం చేసిన వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని గౌరవించేవారైతే ఇలా జరిగేది కాదు. విగ్రహాల విషయం వచ్చినప్పుడు అయిలమ్మ, కొమరయ్యల పేర్లు స్మరించేవారు నిజంగా వారు ఎవరిపై ఎందుకు పోరాడారో తెలియనట్టు నిజాంను కీర్తిస్తున్నారని అనుకోలేము.
ఓ నిజాం పిశాచమా! కానరాడు
నిన్ను పోలిన రాేజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణా కోటి రతనాల వీణ అని దాశరథి నిజాం జైలు గోడలపై బొగ్గుతో రాశాడు! మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు అని నిప్పులు కక్కాడు.
చుట్టుపట్ట సూర్యాపేట
నట్టనడుమ నల్లగొండ
ఆవాల హైద్రాబాదు
తర్వాత గోలకొండ
గోలకొండ ఖిల్లా కింద -
నీ గోరి కొడతాం కొడకో
నైజాం సర్కరోడా!
ఆనాడు తెలంగాణా పోరాట యోధుడైన ప్రజాకవి యాదగిరి రాసిన గీతం ఆయన తుపాకి గుళ్లకు నేలకొరిగినా ఇప్పటికీ జనాన్ని వుర్రూతలూగిస్తుంది.
నీ గోరికాడకొచ్చి
నేను మొక్త కొడకో అని పాడుకోవలసిన పరిస్థితి కెసిఆర్‌కు ఎందుకు కలిగింది? నాలుగేళ్ల కిందట ఆయన నిజాం వర్ధంతికి హాజరై ప్రశంసలు కురిపించినపుడు నిజమూ నిజామూ పేరిట రాసిన వ్యాసంలో నేను అడిగిన ప్రశ్న

Tuesday, October 25, 2011

సకల విరమణ.. తదనంతరం...?



ఊహించినట్టుగానే ఉచితమైన రీతిలోనే సకల జనుల సమ్మె 42 రోజుల తర్వాత విరామం తీసుకుంది. విరమణ అన్నా, విరామం అన్నా వాస్తవంగా వర్తమాన ప్రభావంలో పెద్ద తేడా ఏమీ వుండదు. రాజకీయ నాటకాలతో ఉత్పన్నమైన సమస్యలకు సంక్షోభాలకు ఉద్యోగుల సమ్మెలు పరిష్కారం చూపించలేవని ఈ బ్లాగులో రాయడమే గాక ఇతరత్రా కూడా స్పష్టంగానే చెబుతూ వచ్చాను. ఇది సమ్మెదార్లను తక్కువ చేయడం కాదు. సవాళ్లు సంక్లిష్టతల తీవ్రతను చెప్పడం మాత్రమే. వరుసగా వివిధ తరగతులు విరామం తీసుకోవడం అనివార్యమైన పరిణామం. ఈ వాస్తవాన్ని గుర్తించడంలో ఎవరూ ప్రతిష్టలకు పోనవసరం లేదు. అలాగే విరమించారు గనక విఫలమైనారని ఇతరులు భావించనవసరం లేదు. ఇలాటి విషయాల్లో జయాపజయాల లెక్కల కన్నా జన హితమే కొలబద్దగా పెట్టుకోవాలి. అయితే ఉద్యోగులైనా విద్యార్థులైనా రాజకీయ వాస్తవాలను ప్రాంతాల వారీ కోర్కెల పరిమితులను కూడా గమనంలోకి తీసుకోవడం అవసరం. రాజకీయ సమస్యను భావోద్వేగ భరితంగా మార్చి చూపించడం స్వార్థపర శక్తులకు ఉపయోగం తప్ప విశాల జనబాహుళ్యానికి కాదు. పాలకులు తల్చుకుంటే రాష్ట్ర విభజన చేయొచ్చు. ప్రస్తుతానికి వారు అలా అనుకోవడం లేదు. ఆ అవకాశం లేదని కూడా పదే పదే స్పష్టంగానే చెబుతున్నారు. రెండువారాల్లో వచ్చేస్తుందని కెసిఆర్‌ చెప్పినప్పుడు గాని నవంబరు 1 కి వస్తుందని కోదండరామ్‌ అన్నప్పుడు గాని అవి ఆధారరహితాలేనని అందరికీ తెలుసు. వారికి ఇంకా బాగా తెలుసు.సమ్మె విరమణకై విజ్ఞప్తి చేసిన ఆజాద్‌ వ్యాఖ్యలలో కూడా ఇసుమంతైనా కొత్త దనం లేదు. అన్నీగత వైఖరి పునరుద్ఘాటనలే. అయినా ఆ ప్రకటన పెద్ద ప్రధానమైందన్నట్టు చూపించడంలో వాస్తవికత శూన్యం. ఇప్పుడు నిరాహారదీక్షలు అంటున్నారు గాని ఇంత త్వరలో పరిస్థితులు మారిపోతాయిని అనుకోవడానికి ఆస్కారమే లేదు. కాకపోతే వూపు నిలబెట్టడానికి ఉపయోగపడొచ్చు. కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయ ప్రకటన వేగవంతం చేయడమే ఇప్పుడు జరగాల్సింది.

తెలుగు పీఠం వస్తున్నట్టేనా?






తెలుగు భాష ప్రాచీన హౌదా కోసం తీవ్ర పోరాటం తర్వాతనే ఆలస్యంగా కేంద్రం అందుకు అంగీకరించింది.ఆ నిధులు రాకముందే వాటి గురించి ఆలోచించే భాషా సేవకులు పలువురు రాష్ట్రంలో పోటీలు పడ్డారు. అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న తెలుగు విశ్వ విద్యాలయం ఈ బాధ్యత వహిస్తుందా లేక తెలుగు అకాడమీలోనో మరో దాంట్లోనో కలపాలా అని చర్చ మొదలైంది.ఈ లోగా కేంద్రం ఇందుకు సంబంధించి అధ్యయన పీఠాన్ని తీసుకెళ్లి మైసూరులో పెడుతున్నట్టు ప్రకటించి మరో వివాదానికి కారణమైంది.మైసూరులో భారతీయ భాషల అధ్యయన కేంద్రం వున్నమాట నిజమే గాని దాని పరిధి పద్ధతి వేరు. తెలుగును వారు సరిగ్గా పట్టించుకోరన్న విమర్శలూ వున్నాయి. అసలు తెలుగు భాష వికాసం కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాన్ని మరో రాష్ట్రంలో నెలకొల్పవలసిన అవసరమేమిటి? దీనిపై ప్రతిపక్షాలు భాషా వేత్తలు నిరసన తెల్పిన మీదట ఇప్పుడు హైదరాబాదులోనే దాన్ని నెలకొల్పాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సూచనలు వస్తున్నాయి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆ మేరకు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అంతవరకూ మంచిదే. అసలు మైసూరులో నెలకొల్పాలన్నది ప్రాచీన భాషా విభాగమట. ప్రాచీన సాహిత్య విభాగం బేతవోలు రామబ్రహ్మం ఆచార్యత్వంలో హైదరాబాదు యూనివర్సిటీలో నెలకొల్పబడింది. ఇప్పుడు మైసూరు ఆలోచనే మానుకుని తరలి వస్తే మరీ మంచిది. అయితే ఈ కేంద్రం రావడం ఒకటైతే దాన్ని సద్వినియోగం చేసుకోవడం మరొకటి. దుర్వినియోగాలు అరికట్టడం ఇంకోటి.కనక ప్రభుత్వం తెలుగు భాషాభిమానులు నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని భాషా వికాసానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆశించాలి.

డిఎస్‌ రాకతో మూడవ కేంద్రం



కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీలో అంతర్గత కలహాలను ప్రోత్సహించి విభిన్న అధికార కేంద్రాలను ఏర్పాటు చేసే పని పున: ప్రారంభించింది. శాసనమండలికి పిసిసి మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్‌ను నియమించడం ఈ దిశలో మరో చర్య. ఇప్పటికే కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణల మధ్య సాగే ప్రచ్చన్న యుద్దం చాలనట్టు డిఎస్‌ కూడా తోడవువతారనడంలో సందేహం లేదు. ప్రాంతీయ కోణం ఈయన విషయంలో బలంగా వుంటుంది. లోగడ నిజామాబాద్‌లో గెలిస్తే పెద్ద మంత్రినవుతానని బాహాటంగా ప్రచారం చేసుకున్న డిఎస్‌ మనసులో మాట అందరికీ తెలుసు. పెద్ద మంత్రి కావడానికి ఎంఎల్‌ఎ ఎంఎల్‌సి ఏదైనా ఫర్వాలేదు! కనక ఇప్పటి నుంచి ఆయన ఆ పనిలో వుంటారు.ఇకపోతే తెలంగాణాలో పార్టీ ఎంఎల్‌లను దారికి తెచ్చుకోవడానికి జానారెడ్డిపై ఆధారపడటానికి లేదని భావిస్తున్న అధిష్టానం డిఎస్‌ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. కిరణ్‌,బొత్స,డిఎస్‌ ముగ్గురు మోతుబరులు పోటీ పడి పార్టీని ప్రభుత్వాన్ని కాపాడటం అధిష్టానం పని తేలికచేయొచ్చు. కాకపోతే ఈ నేతలు ప్రజల కోసం కూడా పోటీ పడితే తప్పులేదు ఆ పోటీ ఆధిపత్యం చుట్టూ తిరిగే అవకాశాలే ఎక్కువ. ఆ విధంగా ఒకరిపై ఒకరు పోటీ పడుతుంటే అధిష్టానం అందరినీ తిప్పుకుంటూ గుప్పిట్లో పెట్టుకుంటుంది.

నరహంత ఖాతాలో గడాఫీ

గడాఫీ మరణంపై తక్షణ స్పందన, వచ్చిన వ్యాఖ్యలకు సమాధానం లోగడ రాశాను. దీనిపై ప్రజాశక్తిలో రాసిన వివరమైన వ్యాసం విమర్శకుల కోసం అందిస్తున్నాను- తెర



నియంతవో.. నీతి మంతుడివో.. ఉత్సాహివో..ఉన్మాదివో.. పోరాడిన యోధుడివి, నిలబెట్టిన నాయకుడివి..మంటల మధ్యనా మడమ తిప్పని స్థయిర్యం, పంజరంలోనూ లొంగని ధైర్యం..నీలోనే చూసిందొక కాలం,,నీవే ప్రతిఘటనకు ఆలవాలం.. కాల సంధ్యలో నీ బలిదానం,, బుష్సాసురులకు రణనాదం.. అయిదేళ్ల కిందట 2007వ సంవత్సరం ప్రవేశించనున్న తరుణంలో సద్దాం హుస్సేన్‌ను లోపాయికారిగా వురి తీసిన కథనాన్ని విడుదల చేసినప్పుడు రాసిన చరణాలివి. లిబియా అధినేత కల్నల్‌ గడాఫీ అమానుష హత్య తరుణంలో ఇవే వాక్యాలు గుర్తుకు వస్తున్నాయి. రోజెన్‌ బర్గులను కక్షకట్టి కరెంటుతో చంపినా, పర్షియా నేత మొసాదిక్‌ను సిఐఎ హత్య చేయించినా,వజ్రాల సీమ కాంగోలో పాట్రిస్‌ లుముంబా ప్రాణాలు బలిగొన్నా, లాటిన్‌ అమెరికాలో చే గువేరాను బలిగొన్నా, చిలీలో ప్రజలెన్నుకున్న అలెండీని సైన్యం హతమార్చినా, ఆఫ్ఘనిస్థాన్‌లో అభ్యుదయ పాలకుడు నజీబుల్లాను నడివీదిలోవురి తీయించినా, సోషలిస్టు రుమేనియా అధినేత సెషెస్క్మూను నిరంకుశంగా కాల్చిపారేసి టీవీలలో అదే పనిగా చూపించినా అన్నిటా ఒకే దుర్నీతి. ఒకే దుర్మార్గం. కొన్ని చోట్ల సైన్యం,కొన్ని చోట్ల కోర్టులు, కొన్నిచోట్ల కిరాయి హంతకులు.... ఇప్పుడు లిబియాలో చూస్తున్నది ప్రజాస్వామ్యం పేరిట తిరుగుబాటు శక్తుల ముసుగులో సాగిన ఘాతుకం.
నేషనల్‌ ట్రాన్షిషనల్‌ కౌన్సిల్‌(ఎన్‌టిసి) ఆధ్వర్యంలో గడాఫీ హతమైనట్టు చెబుతున్నా దాని వెనక వున్నది నాటో అమెరికాలే. అరబ్‌ వసంతం పేరిట పలు అరబ్‌ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ప్రజ్వరిల్లినప్పుడు అమెరికా ద్వంద్వ ప్రమాణాలు

Friday, October 21, 2011

పోలవరం టెండర్ల పాఠాలు



పోలవరం టెండర్లను టిఆర్‌ఎస్‌కు అనుకూలమైన, నమస్తే తెలంగాణాతో సంబంధం కలిగిన ఎస్‌డబ్ట్యు ఎమ్మార్‌ పటేల్‌ కన్సార్టియం చేజిక్కించుకున్నట్టు తెలుగు దేశం నాయకుడు రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణపై చర్చకు నన్ను ఆహ్వానించారు గాని వెళ్లడం కుదరలేదు. మరో ఛానల్‌లో వ్యాఖ్యలు మాత్రం చేశాను. ే ఈ అంశం నేను ఇంత కాలం చేస్తున్న ఒక ప్రధాన వాదనను ధృవపరుస్తున్నది. తెలంగాణా లేదా సీమాంధ్ర( ఈ పదం ఇటీవల కృత్రిమంగా సృష్టించింది) అన్న ప్రాంతాల ప్రాతిపదికన పెట్టుబడిదారులు పేదలు వుండరు. వివిధ ప్రాంతాల్లో వివిధ స్థాయిల్లో వుంటారు. వ్యాపార యుద్దాలు రాజకీయ ఘర్సణలు అన్ని చోట్లా జరుగుతూనే వుంటాయి. రేవంత్‌ ఆరోపణను ఖండించేందుకు టిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న సమర్థనల్లో వుండాల్సినంత తీవ్రత లేదంటే కారణం అక్కడ ఒక టెండరు అంటూ వుండటమే. ఇందులో రెండు అంశాలేమంటే - పెట్టుబడిదారులు ఇక్కడా వున్నారని, వారికి ఇక్కడ ప్రధాన పార్టీతో సంబంధం వుందని . పైగా ఆ పార్టీ వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టు పని వారే చేపట్టారని. మిగిలిన రాజకీయాలు వ్యాపారాలు ఎలా వున్నా ఈ మేరకైతే గుర్తించక తప్పదు. ప్రయోజనాలు లేని రాజకీయాలు వుండవు. వ్యత్యాసాలు లేని ప్రాంతాలూ వుండవు. గతంలో లగడపాటి తెలంగాణాలోనే దొరలు పీడకులు వున్నారని పుస్తకాలు సీడీలు పంపిస్తే నేను ఏకీభవించలేదు. ఎందుకంటే మందసా, చల్లపల్లి, మునగాల జమీందార్లకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిన తర్వాతనే ఆ ప్రభావం నైజాం వ్యతిరేక పోరాటానికి దారి తీసింది. కాకపోతే ఇక్కడ దొరతనం వెట్టిచాకిరీ రూపంలో దారుణంగా వుండేది. కాని తరతమ తేడాలతో ఆర్తిక దోపిడీ సామాజిక పీడన అంతటా వున్నాయి. అలాగే పెట్టుబడిదారులు కూడా వున్నారు. తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం సీమాంధ్ర పెట్టుబడిదారులకే వ్యతిరేమని చెప్పడం

ప్రపంచ నియంతపట్ల ప్రమత్తతా?



గడాఫీ హత్య లేదా హతం వెనక అమెరికా పాత్ర దాచేస్తే దాగని సత్యం. ఆయన కడిగిన ముత్యం అని నేనెక్కడా చెప్పలేదు. ఆయన హయాంలో అభివృద్దిని కూడా వికీ పీడియాలో చూడొచ్చన్నాను. ఆయన ఎలాటి వాడైనా ఎక్కడో వున్న అమెరికా కూటమి జోక్యం అవసరమేమిటి? ఇలా ఇతర దేశాధినేతలను హతమార్చడం మొదలెడితే అంతమెక్కడీ దేశాల సార్వభౌమత్వాలకు రక్షణ ఎక్కడీ విమానాన్ని కూల్చివేయడం, హొటల్‌పై దాడి వంటివాటికి దేశాలనే బాంబు దాడులతో దగ్ధం చేస్తున్న అమెరికా అమానుష వ్యూహాలకూ పోలిక ఎక్కడీ గడాఫీని త్వరితంగా నిర్మూలించాలని ఒత్తిడి చేయడానికే విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్‌ లిబియా వెళ్లిన సంగతి మీడియాలో రాలేదా? గడాఫీ తన దేశానికి నియంత అవునో కాదో గాని అమెరికా ప్రపంచానికే నియంతగా మారిన అమెరికా అంతకంటే కొన్ని రెట్లు ముప్పుగా వుందనడంలో సందేహం లేదు. సోవియట్‌ యూనియన్‌ ఆఫ్ఘనిస్తాన్‌లో జోక్యం చేసుకుందనే పేరుతో మొదలైన అమెరికా వినాశకర వ్యూహాలు ఆఖరుకు 9/11 ఘటనలకు దారి తీసి ఆ పైన మరింత దారుణ రూపం తీసుకున్నాయి. ఇంకా దిగజారతాయి. ఈ మాటలు చెప్పకుండా దాచుకోవలసిన అవసరం ఏ మాత్రం లేదు. అవి దారుణమని అనుకోలేని వారికి ఇవే దారుణంగా కనిపిస్తే నేను చేయగలిగింది లేదు. ఇది అమెరికా పట్ల అమెరికా ప్రజల పట్ల వ్యతిరేకత కాదు. వారి అమానుష ఆధిపత్య వ్యూహాల అభిశంసన మాత్రమే.
దీనిపై నా ఎంట్రీపై చాలా వ్యాఖ్యలు చేయడమే గాక వారిలో వారు వాదించుకోవడం ఆలస్యంగా చూశాను.ఆ భాషను పద ప్రయోగాలను నేను హర్షించలేను. కనకనే మొత్తం తీసేశాను. ఇక ముందైనా వాదనలో విషయానికి విజ్ఞతకు ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తాను.

Thursday, October 20, 2011

రాష్ట్ర విభజనపై అద్వానీ వింత వాదన




బిజెపి వృద్ధ నేత అద్వానీ రథయాత్రపై గతంలోనే వ్యాఖ్యానించాను. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన పర్యటన తీరు అనుకున్న దానికన్నా విపరీతంగా నడిచింది. అంత పెద్ద నాయకుడు వచ్చినపుడు జనం రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పైగా బిజెపి రాష్ట్ర నేతలు శాయ శక్తులా సమీకరణ చేయడం సహజం. ఇంతకూ అవినీతికి వ్యతిరేకంగా ఆయన మొదలెట్టిన యాత్ర యెడ్డీ అరెస్టుతో ఆదిలోనే హంసపాదులా మారింది. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఆయన పార్టీ వాడైన గాలి జనార్థనరెడ్డి జైలులో వున్నాడు. ఇన్ని వున్నా అవినీతికి వ్యతిరేకంగా సూక్తులు చెప్పడం అద్వానీ వంటి గడుసు నేతకే చెల్లుతుంది.. ప్రధాని పరుగులో తాను ఆలసి పోలేదని చెప్పడానికే ఆయన రథ యాత్ర అని ప్రతివారికీ తెలుసు. అంతకంటే కూడా ఆయన తెలంగాణా విభజన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి చెప్పడంలో టిఆర్‌ఎస్‌ను కూడా మించి పోయి మాట్లాడ్డం జాతీయ నేత హౌదాకు తగినట్టు లేదు. శాసనసభ తీర్మానం లేకుండానే వచ్చే జనవరిలోనే ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటులోపెట్టేయొచ్చని చెప్పడం రాజ్యాంగ విషయాలనూ తారుమారు చేసింది. 3 వ అధికరణం ప్రకారం

అమెరికా హత్యల జాబితాలో గడాఫీ



లిబియా అధినేత కల్నల్‌ గడాపీని వెంటాడి వేటాడి ఒకప్పుడు సద్దాం హుస్సేన్‌ను హతమార్చినట్టే అమెరికా అండదండలు గల వ్యతిరేక శక్తులు అంతమొందించాయి. మొత్తం అరబ్‌ ప్రపంచంలో ఆధునికత, లౌకికతత్వం నింపిన మరో పాలకుడు ఖతమై పోయాడు. మానవాభివృద్ధి సూచికల్లో లిబియా ఎంతటి ప్రగతి సాధించిందో ఇదే ఇంటర్‌ నెట్‌లోని వికీ పీడియా చూస్తే తెలుస్తుంది. కొద్ది రోజుల కిందటనే అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ లిబియాలో పర్యటించి గడాఫీని హతమారిస్తే సహాయం చేస్తామని ప్రకటించి వచ్చారు. లిబియాలో వచ్చే మార్పులలో తమకూ వాటా వుండాలని అమెరికా అన్న సంగతి చాలా ఛానళ్లలో ప్రసారమైంది. గడాఫీ నియంత అని పెద్ద ప్రచారమే జరుగుతుందనడంలో సందేహం లేదు. ఆయన పాలనలో అనేక పొరబాట్టు వుండొచ్చు కూడా. కాని వాటికి శిక్షలు వేసే హక్కు అమెరికాకు ఎవరిచ్చారనేది ప్రశ్న.
1986లోనే గడాఫీ హత్యకు అమెరికా దాడులు చేసింది. ఆయన చిన్న కుమార్తె బలైంది అప్పట్లో. తర్వాత ఎన్ని హత్యా ప్రయత్నాలు

Saturday, October 15, 2011

రాజకీయ మలుపుల మధ్య రైల్‌రోకో




నెలరోజులు దాటిపోయిన సకల జనుల సమ్మె ద్వితీయ ఘట్టంలో సహజంగానే అనేక మలుపులు వస్తున్నాయి. మూడు రోజుల రైల్‌రోకో సందర్భంగా పోలీసులు, ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుని అరెస్టులు చేయడం ఇందులో ముఖ్యమైంది. గతంలోనూ ఆందోళనలు చేస్తున్నవారిని నిర్బంధించినా ఈ సారి ముందుగానే డిజిపి తీవ్ర హెచ్చరికలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. మామూలుగా ప్రజా ఉద్యమాల సందర్భంలో రైల్‌రోకోల వంటివి సంకేత ప్రాయంగా కొన్ని గంటల పాటు జరిగేవి. కాని ఈ సారి తెలంగాణా జెఎసి మూడు రోజుల పాటు రైల్‌ రోకో ప్రకటించింది. రెండు సార్లు వాయిదాల అనంతరం శనివారం నాడు అది ప్రారంభమైంది. డిజిపి దినేష్‌ రెడ్డి రైల్‌రోకోలో పాల్గొన్నవారిపై చాలా తీవ్రమైన శిక్షలకు దారి తీసే కేసులు నమోదు చేస్తామని చెప్పడం ముందే వివాద గ్రస్తమైంది. తమ అధిష్టానం నుంచి ప్రకటన తెప్పించడంలో విఫలమైన కాంగ్రెస్‌ ఎంపిలు కూడా రైల్‌రోకోలో పాల్గొంటామని ప్రకటించడం కూడా రాజకీయంగా ప్రచారం పొందింది. అయితే మిగిలిన వారితో పాటు ఎంపిలను కూడా అరెస్టులు చేసేందుకు సిద్ధమవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తను గట్టిగా వుండబోతున్నాననే

రథయాత్ర రాజకీయాలు






అద్వానీ రథయాత్రపై బిజెపి వెలుపల కన్నా అంతర్గతంగానే ఎక్కువ అలజడి కనిపిస్తుంది. నరేంద్ర మోడీ నిరాహారదీక్షతో మొదలైన ఈ చర్చ ఇప్పుడు మరింత మంది నాయకులకు పాకింది. ప్రధాని పదవికి అభ్యర్థులెవరనే విషయంలో(ఇప్పుడు ఎన్నికలూ లేవు, బిజెపి విజయం సాధించిందీ లేదు) పోటా పోటీ ఒక పట్టాన ముగిసేట్టు లేదు. మోడీ అద్వానీని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు రాసినా ఆయన మోడీని మెచ్చుకున్నా ప్రధాని పదవిపై మాత్రం సూటిగా వ్యాఖ్యలు లేవు. పోటీలో లేను అని అద్వానీ అన్నట్టు చాలాసార్లు శీర్షికలు కనిపిస్తున్నా ఆయన అలా సూటిగా చెప్పింది లేదు. పార్టీ నిర్ణయిస్తుందనీ, తన కోసం చేయడం లేదని పరిపరి విధాల మాట్లాడటమే జరుగుతున్నది. ఇది ఇలా వుంటే బిజెపిలో ఇంకా రాజ్‌నాథ్‌సింగ్‌, యశ్వంత్‌ సిన్హా, మురళీ మనోహర్‌ జోషి తదితరులు చాలా మంది తామూ రేసులో వున్నామని సూచనలు వదులుతున్నారు. విలక్షణ పార్టీలో విస్తారంగానే ప్రధాన మంత్రులున్నారు. 1995లో తన మాట వినకుండా వాజ్‌పేయిని ముందుకు తెచ్చి అద్వానీ పొరబాటు చేశారన్నట్టు ఉమా భారతి మాట్లాడితే బలపర్చిన వారు మాత్రం పెద్దగా లేరట.

శంకర్‌రావు ఆరోపణలపై విచారణ వుత్తిదే!





హౌం మంత్రి సబితా ఇంద్రారెడి, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలపై
సహచర మంత్రి శంకర రావు చేసిన తీవ్రారోపణలను విచారణకు స్వీకరించవచ్చునని జస్టిస్‌ నరసింహారెడ్డి ఆదేశించినట్టు వచ్చిన వార్తల లోతుపాతులు ఈ బ్లాగులో లోగడ చర్చించాము. అవి కేవలం సిఫార్సులు తప్ప నిర్ణయాలు కాదని, ఆ పని చేయవలసింది వేరే ధర్మాసనమని కూడా చెప్పుకున్నాము.నిజంగానే ఇప్పుడు హైకోర్టు ఉన్నాతాసననం ఆ సిఫార్సును తోసిపుచ్చడమే గాక మంత్రుల విభేదాలలో తలదూర్చవద్దని సలహా ఇచ్చింది. ఈ సందర్భంగానే వార్తా కథనాలను ఎంత మేరకు తీసుకోవచ్చనే దానిలో సింగిల్‌ జడ్జి పరిధి మించారన్న భావన కలిగించే వ్యాఖ్యలు కూడా చేసింది. ఫ్రధాన న్యాయమూర్తి కక్రూ, మరో న్యాయమూర్తి అఫ్జల్‌ పుర్కార్‌లు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత హైకోర్టు పరిస్థితి నేపథ్యంలోనూ, నరసింహారెడ్డి తీర్పుల రాజకీయ ప్రాధాన్యత నేపథ్యంలోనూ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆరోపణల నిజానిజాల కంటే చట్టబద్దమైన పద్ధతులు, కోర్టుల నిబంధనల రీత్యానే ఈ అంశం ప్రస్తావించాల్సి వచ్చింది.ఇంతకూ శంకరరావుపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా వున్నా ఆయన్ను కదిలించలేకపోవడానికి కూడా రాష్ట్ర రాజకీయాలు, అధిష్టానం అనుమతి నిరాకరణే కారణమని కూడా భావిస్తున్నారు. బహిరంగంగా సహచరులపై ఆరోపణలు చేసిన ఆయన మంత్రివర్గంలోనే కొనసాగుతుండగా ఆ ఆరోపణలకు స్పందన లేదా ఖండన లేకపోవడం ఇక్కడ విపరీతం!

Monday, October 10, 2011

నిరాధార కథనాలతో కాలక్షేపం


తెలంగాణా సమస్యపై ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారనే భావన కలిగించేందుకు కేంద్ర ప్రతినిధులు, తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమం వూపును నిలబెట్టడం కోసం టిఆర్‌ఎస్‌, జెఎసి నేతలు కూడా అంతా ఆఖరిదశకు వచ్చిందనే రీతిలో మాట్లాడుతున్నారు. తాము కూడా క్రియాశీలంగా చక్రం అడ్డం వేస్తున్నట్టు కనిపించడానికి ఇతర ప్రాంతాల కాంగ్రెస్‌ తెలుగుదేశం నాయకులు కూడా హడావుడి చేస్తున్నారు. ఇవన్నీ చూసి మీడియా కూడా వీక్షకులకు ఆకట్టుకోవడానికి ఏదో ఒక కథనం ఉదయాన్నే చలామణిలో పెడుతున్నది. ఎవరు ఎవరిని కలిసినా దానిపై అంతులేని వూహాగానాలు సాగుతున్నాయి. వీటికి కేవలం మీడియానే నిందించి లాభం లేదు. రాజకీయ అవసరాల కోసం ఆ విధమైన కథనాలను అటు పాలక వర్గీయులూ ఇటు తెలంగాణా రాజకీయ నాయకులూ కూడా అందిస్తున్నారు. ఈ కథనాల మాటున కేంద్ర నాయకులు బహిరంగంగానే మాట్లాడిన మాటలూ సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం సరిగ్గా జరగడం లేదు. ఉదాహరణకు ఈ పదిహేనురోజులలోనూ కేంద్రం నుంచి మాట్లాడిన ప్రతివారూ సమస్య త్వరితంగా తేలేది కాదని, అందరికీ ఆమోదంగా వుండాలనీ పదే పదే చెబుతున్నారు. సంప్రదింపులు కొనసాగాలని అంటున్నారు. తెలంగాణా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేట్టయితే దాన్ని సూచనగా వెల్లడించి లాభం పొందడానికి యత్నిస్తారే తప్ప ఇన్ని సన్నాయి నొక్కుల అవసరం వుండదు. దానిలో సమస్యలు వున్నాయన్న మాట నిజమే అయినా కేంద్రం ఇప్పుడే తెలుసుకున్నట్టు మాట్లాడ్డమే విచిత్రం. అలాగే సలక జనుల సమ్మె ఉధృతంగా జరుగుతున్నా దాన్ని బట్టి ప్రతిస్పందించేందుకు కేంద్రం సిద్దం కావడం లేదన్నది స్పష్టం. కనక సమ్మె సెగ తగిలినందువల్లనే కేంద్రంలో కదలిక వచ్చిందనీ చెప్పడం వాస్తవాలతో పొసగడం లేదు. సమ్మె విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం

Saturday, October 8, 2011

అనిశ్చితి యథాతథం- ఆచరణ అగమ్యం



రాష్ట్ర రాజకీయాలలో ఏదో తీవ్ర నిర్ణయం జరగబోతుందన్న వాతావరణాన్ని ఈ వారాంతంలో కేంద్రం కల్పించింది. దసరా పండుగ రోజున గవర్నర్‌కు ప్రధాని పిలుపు అందినట్టు వచ్చిన వార్తలతో మొదలైన హడావుడి రాష్ట్ర కాంగ్రెస్‌ పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ పునరుద్ఘాటన వరకూ కొనసాగింది. గతంలో చెప్పిన ప్రకారం సంప్రదింపులు జరపడం తప్ప త్వరితంగా చేస్తున్నదేమీ లేదని ఆయన తేల్చి చెప్పాక అనవసరంగా హైరాన పడిన వారికి ఆశ్యర్యమే మిగిలింది. షరా మామూలుగా ఇదంతా మీడియా హడావుడి అని చప్పరించేసి నేరం దానిపైకి నెట్టేస్తారు . రరరకాల మార్గాలలో ఏవేవో కథనాలు మీడియాకు అందించి కృత్రిమమైన వూహాగానాలకు ఆస్కారం కల్పించడం స్పందనలు గమనించిన తర్వాత కొట్టిపారేయడం కేంద్రానికి పరిపాటి అయింది. ఒక వైపున తమలో తామే