Pages

Sunday, July 15, 2012

రాష్ట్రపతి ఎన్నికల రాజకీయాలు



భారత రాష్ట్రపతి ఎన్నిక ఈ సారి తీవ్ర రూపం తీసుకున్నదని ఎన్‌డిఎ అభ్యర్థి పి.ఎ.సంగ్మా వ్యాఖ్యానించారు గాని వాస్తవంలో యుపిఎ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ విజయావకాశాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధినేత ఇందిరాగాంధీయే వైఖరి మార్చుకున్న 1969 ఎన్నికలను మినహాయిస్తే ఇంత వరకూ అధికార పక్ష అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇందుకు చట్ట సభల బలాబలాలు ఒక కారణమైతే రాజకీయ పార్టీల విన్యాసాలు మరో కారణం. ఇన్నిటి మధ్యనా వామపక్షాలు,అందులోనూ సిపిఎం ఎప్పుడూ ఒక నిర్దిష్ట వైఖరితో వ్యవహరిస్తూ వస్తున్నది. అత్యున్నతమైన ఆ రాజ్యాంగ బాధ్యత స్వీకరించే వ్యక్తి అభివృద్ది నిరోధక మతతత్వ నేపథ్యం కలిగి వుండరాదన్న సూత్రానికి సంబంధించి సిపిఎం ఎన్నడూ వెనక్కు పోలేదు. ఇప్పుడు ప్రణబ్‌ ముఖర్జీని బలపర్చాలని తీసుకున్న నిర్ణయంలోనూ అదే హేతువు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలా పార్టీలు తమ వైఖరి తేల్చుకోలేక తర్జనభర్జన పడుతుండగా సిపిఎం అలాటి శషభిషలు లేకుండా తన విధానం సూటిగా ప్రకటించిందంటే అదే కారణం.
భారత రాష్ట్రపతిని రాజ్యాంగ రీత్యా అధికారాలు లేని రబ్బరు స్టాంపుగా అభివర్ణిస్తుంటారు. బ్రిటిష్‌ రాణితో పోలుస్తుంటారు. పార్లమెంటరీ వ్యవస్థ క్యాబినెట్‌ పాలనా విధానం వున్న మాట నిజమే అయినా రాష్ట్రపతి స్థానం అంత అప్రధానమైనది గాని లాంఛనమైనదిగానీ కాదు. దేశాన్ని పాలించవలసిన ప్రభుత్వాధినేతను ఆహ్వానించవలసింది రాష్ట్రపతి మాత్రమే. ఏదో ఒక పార్టీకి గుత్తాధిపత్యం వుండే కాలం పోయి మిశ్రమ ఫ్రభుత్వాలు వచ్చాక ఈ విషయంలో రాష్ట్రపతి విచక్షణాధికారం చాలా చాలా కీలకమై

Saturday, July 7, 2012

తప్పు మీద తప్పు చేస్తున్న సర్కారు!



వివాదాస్పద జీవోల విషయంలో కోర్టు నోటీసులు ఎదుర్కొంటున్న అమాత్యులకు (అందులోనూ ఇద్దరు మినహా) న్యాయ ఖర్చులు భరించి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమైంది. కాంగ్రెస్‌ పార్టీని ఆవరించిన అయోమయాన్ని, అది అనుసరిస్తున్న ద్వంద్వనీతిని వెల్లడించే నిర్ణయం ఇది. ఆ 26 జీవోల ఆధారంగానే జగన్‌ మోహన రెడ్డి అక్రమ లబ్ది పొందారని కేసు నడుస్తుంటే- వాటికి కారకులైన వారిని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుంది? అందులోనూ ఇద్దరిని ఎలా మినహాయిస్తుంది? ఇందులో ఎలాటి సూత్రమూ వుండనవసరం లేదా?జీవోలు సక్రమమైతే అప్పుడు క్విడ్‌ ప్రో కో పద్ధతిలో భారీ పెట్టుబడులు ఎందుకు పెడతారు? అంటే జగన్‌ కూడా నిర్దోషి అని ప్రభుత్వం చెప్పదలచిందా? మరి ఆయనపై అవినీతి ఆరోపణలతో దండెత్తదం దేనికి? అలాగే మంత్రులకు కల్పించిన రక్షణ ఐఎఎస్‌లకు ఎందుకు ఇవ్వరంటే ఏం చెబుతారు? నిజానికి వారు తమ శాఖ మంత్రుల మాట ప్రకారమే నడుచుకున్నామని చెప్పే అవకాశం పూర్తిగా వుంటుంది.కనక అవినీతిపై దర్యాప్తులో గాని విమర్శలలో గాని ద్వంద్వనీతి చెల్లుబాటు కాదని ఏలిన వారు గ్రహిస్తే మంచిది.

ప్రాంతీయ వివాదాలకు ఆజ్యం పోస్తున్న ప్రభుత్వం



ప్రాంతీయ వివాదాల చాటున మనుగడ సాగించుకోవాలన్న వ్యూహం నానాట ఆందోళనకరంగా మారుతున్నది. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఏదో పరిష్కారం ప్రకటిస్తామన్న వూహాగానాలపై చాలా తతంగమే నడిచింది. తాడూ బొంగరం లేని ఆ కథనాల మధ్య హొం మంత్రి చిదంబరం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.దాంతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా రాయల తెలంగాణా పేరిట వ్యాఖ్యానాలు దానిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తనకు మాలిన తతంగంగా దీన్ని నెత్తిన వేసుకున్న మంత్రి టిజి వెంకటేష్‌ కాస్త వెనక్కు తగ్గవలసి వచ్చింది. వైఎస్‌ఆర్‌సిపి నేతలైన శ్రీకాంత్‌ రెడ్డి వంటివారు దీనిపై ఆవేశ భరితంగా మాట్లాడ్డం మరో పరిణామం. ఇంతకంటే తీవ్రమైంది సాగర్‌ నీటి విడుదలలో ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం. సున్నితమైన పరిస్థితిని గమనంలో పెట్టుకుని అఖిలపక్షాలతో సంప్రదించి అందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించే బదులు ఆదరాబాదర చర్యలతో అపార్థాలు పెంచడానికే కారణమైంది. మళ్లీ దానిపై కాంగ్రెస్‌ నేతలే అతిగా స్పందించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మెడికల్‌ సీట్ల విషయంలో హరీష్‌ రావు వినోద్‌ కుమార్‌ వంటి వారు లేవనెత్తిన అంశాలు మరింత తీవ్రమైనవి. పోటాపోటీగా నడిచే ఈ సీట్ల విషయంలో అన్ని ప్రాంతాలకు సమతుల్యత పాటించవలసింది పోయి ఒక ప్రాంతంలో అసలు సీట్ల పెంపు లేకుండా చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.దీనికి మెడికల్‌ కౌన్సిల్‌నో మరో సంస్థనో నిందిస్తే సరిపోదు.ఇంత ఉద్రిక్తంగా అనిశ్చితంగా వున్న పరిస్థితులలో వేయి విధాల జాగ్రత్తలు తీసుకోవలసిన ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం క్షంతవ్యం కానిది. ముందస్తుగానే మేల్కొని వుంటే తెలంగాణా ప్రాంతంలోని మెడికల్‌ కాలేజీలలోనూ సీట్లు పెంపు సాధించుకోవడం సాధ్యమై వుండేది. వచ్చిన వాటిని సర్దుకోవడమైనా జరిగివుండేది. స్థానిక నిబంధనలు వున్నప్పుడు ఇలా అసమాన పెంపుదలలు అవాంచనీయమైన స్పర్థలకు దారి తీస్తాయి. నీళ్లనుంచి సీట్ల వరకూ ప్రభుత్వం ఒకే విధంగా వ్యవహరించడం ప్రాంతీయ చిచ్చు పెద్దది చేయడానికి తప్పితే ఏ ప్రాంతంపైనా ఏలిన వారికి ప్రత్యేకాభిమానం వుండటం వల్ల అనుకోలేము. వారికి కావలిసింది అధికారం మాత్రమే. ఇప్పటికైనా దీనిపై సత్వర కదలిక రావాలి. అవసరమైతే అసాధారణ చర్యలు తీసుకున్నా మంచిదే. ఇదే సమయంలో జెఎసి స్థానికులకు ఉద్యొగాలు, వనరుల వగైరాలపై చేసిన డిమాండ్లు దాని గత వైఖరికి కాస్త భిన్నంగానూ తక్షణ స్పందన కలిగించేవిగానూ వుండటం గమనార్హం. రాష్ట్ర విభజన అన్నది కేవలం జపంగా మారకూడదంటే జన సమస్యలపైనా పోరాడాలని నిర్ణయించుకోవడం మంచిదే.

సిబిఐకి అభిశంసన- జగన్‌ పార్టీకి ఆనందం?




మాయావతి ఆస్తుల కేసులో సిబిఐ అతిగా వ్యవహరిస్తోందని అత్యున్నత స్థానం అభిశంసించడం ఆసక్తి కరమైన విషయమే కాదు- రాజకీయంగా జగన్‌ పార్టీ వైఎస్‌ఆర్‌సిపికి చాలా ఆనందకరమే అనుకోవచ్చు. అవినీతి ఆరోపణలపై విచారణ నెదుర్కోక తప్పదనీ, ఉప ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన నిర్దోషిత్వం ప్రాప్తించదని నేను చాలా సార్లు చెప్పాను, రాశాను. అయితే ప్రతిసారీ సిబిఐ పాత్రపైనా ప్రశ్నలు వస్తుంటాయి.వ్యక్తిగతంగా జెడి లక్ష్మినారాయణపై ఆ పార్టీ దాడి కేంద్రీకరించడం వల్ల ఈ ఆరోపణల స్వభావం మారిపోతుంటుంది.వాస్తవంలో సిబిఐ ఎప్పుడూ వివాదాలకు అతీతంగా లేదు. రాజ్యాంగ రీత్యానే అది కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలోనే పనిచేస్తుంటుంది.అలాటప్పుడు రాజకీయాల క్రినీడలు దానిపై పడవని అనుకోవడానికి లేదు. వాజ్‌పేయి ప్రభుత్వం వుండగా అయోధ్య ఘటనలో అద్వానీపై కేసులు ఎత్తివేసి తనపై కొనసాగిస్తున్నందుకు నాటి కేంద్ర మంత్రి మురళీమనోహర్‌ జోషి స్వయానా రాజీనామా చేశారు. మాయావతి, ములాయం, లాలూ వంటి వారి విషయంలోనూ ఈ విధమైన ఉదాహరణలున్నాయి. కేరళలో సిపిఎం కార్యదర్శి పినరాయి విజయన్‌పై పాత కేసు తిరగదోడిన ఘటనలోనూ వైఫల్యం ఎదురైంది. మాజీ సిబిఐ డైరెక్టర్‌ జోగిందర్‌ సింగ్‌ స్వయంగా ఈ విధమైన వివాదాలను ఉదహరించారు. వీటిని సాకుగా చూపించి జగన్‌పై ఆరోపణలన్ని అసత్యాలంటూ ఒప్పుకోవడం సాధ్యం కాదు గాని సిబిఐ తీరుపై విమర్శలకు ఆస్కారం లేదని మాత్రం చెప్పలేము.మాయావతిపై తాజ్‌ కారిడార్‌ వ్యవహారంలో కేసు దర్యాప్తు చేయమంటే ఆస్తుల కేసు ఎందుకు చేశారని సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది.అయితే నాలుగేళ్లుగా అనేక దఫాలుగా నడుస్తున్నప్పుడు ఎందుకు అనుమతించారనే ప్రశ్నకు మాత్రం జవాబు ఆశించలేము. జగన్‌ మోహన రెడ్డి కేసు కూడా హుటాహుటిన ముగిసిపోయేది కాదని గతంలోనే రాశాను. ఇందులోనూ అనేక మలుపులు చూడవలసే వుంటుంది. వాటిలో రాజకీయమైనవీ, న్యాయ సంబంధమైనవీ కూడా వుండొచ్చు.ఆ మలుపులు ఇరు వైపులా వుండొచ్చు కూడా. కాంగ్రెస్‌ తెలుగు దేశంలు కూడా ఈ వాస్తవాన్ని గుర్తించబట్టే దీర్ఘ కాలిక వ్యూహాల రూపకల్పనకు తంటాలు పడుతున్నాయి.. అయితే ఉభయ పార్టీలూ కూడా విధానపరంగా తమ లోపాలు తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధం కావడం లేదు.కేవలం ప్రచారంతో నెట్టుకుపోతే సరిపోతుందన్న భావన ఆ రెండు పార్టీలలో ఇంకా వుంది గనకే ముఖ్యమంత్రి కిరణ్‌ ఇందిరమ్మ రాజ్యం, ప్రతిపక్ష నేత చంద్రబాబు సైకిల్‌ యాత్ర అంటూ హడావుడి పడుతున్నారు. వాస్తవం ఏమిటంటే వాటిని ఆవరించిన విశ్వాస రాహిత్యం అనే రుగ్మత అంతకన్నా తీవ్రమైనది. సిబిఐ దర్యాప్తు కన్నా ఈడీ విచారణలో ఏదో నాటకీయంగా జరిగిపోతుందనే కథనాలు జోరుగా సాగుతున్నాయి గాని ఇటీవలి పరిణామాలను గుర్తు చేసుకుంటే ఇది కూడా సాగలాగబడటం తప్ప తేలేది కాదని అర్థమవుతుంది.

జ్ఞాపకాల నేపథ్యంలో అయోధ్య నిజాలు


బాబరీ మసీదు విధ్వంసం సందర్భంలో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు పాత్రపై మరోసారి దుమారం చెలరేగుతున్నది.వరుసగా వెల్లడవుతున్న వాస్తవాలు ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.అందులోనూ చాలా ముఖ్యమైన వ్యక్తులే నాటి ఘటనలను ఏకరువు పెట్టడం వల్ల కాదని నమ్మకంగా ఖండించలేని స్థితిలో కాంగ్రెస్‌ నాయకత్వం చిక్కుకుపోతున్నది. మాజీ కేంద్ర మంత్రి అర్జున్‌ సింగ్‌ జ్ఞాపకాలు ఆయన మరణానంతరం ప్రచురితమైన ఆయన జ్ఞాపకాలు ఇందుకు కారణమైనాయి.ఆ మరుసటి రోజునే ప్రముఖ పాత్రికేయుడు కులదీప్‌ నయ్యర్‌ పుస్తకం భాగాలు విడుదలవడంతో ఇది మరింత తీవ్రమైంది. కాకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం ఆయన వ్యక్తిగత వ్యవహారంగా పరిమితం చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నది.పివికి, సోనియా కుటుంబానికి మధ్య వైరుధ్యం కోణంలో ఎక్కువ మంది దీన్ని చిత్రిస్తున్నా కాంగ్రెస్‌ రాజకీయ విన్యాసాలు దేశ లౌకిక పునాదుల కోణం నుంచి చూడాల్సిన అవసరం ఎక్కువగా వుంది.
1992 డిసెంబర్‌ 6 వ తేదీన అద్వానీ ప్రభృతుల సమక్షంలో బాబరీ మసీదు విధ్వంసం జరగడం దేశాన్ని ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంత పరచింది. దేశ లౌకిక విలువలకు విఘాతం కలిగింది. తర్వాత మత కలహాలు చెలరేగాయి. అయితే రామజన్మభూమి ఆందోళన పేరుతో జరిగిన ఆ విధ్వంసాన్ని పివి ప్రభుత్వం ఆపలేకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. నాటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ దేశ చరిత్రలోనే లేని విధంగా బహిరంగ ప్రకటన చేస్తూ ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. ఈ ఘటనలపై నియమితమైన లిబర్‌హాన్‌ కమిషన్‌ 48 సార్లు గడువు పొడగించిన తర్వాత పదహారున్నర సంవవత్సరాలకు నివేదిక సమర్పించింది. అందులో పివి తప్పు లేదని కితాబునివ్వడంపై తీవ్ర విమర్శలొచ్చాయి.
రాజకీయ లబ్ది కోసం రామజన్మభూమి వివాదాన్ని రగుల్కొల్పిన బిజెపి నేత అద్వానీ ఆయన వెనక వున్న సంఘ పరివార్‌ల పాత్ర ఒకటైతే ఆ దారుణాన్ని అనుమతించడంలో నాటి పివి ప్రభుత్వ పాత్ర కూడా తక్కువ కాదు. నవంబరులో జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలోనే ఈ సమస్యను సాకల్యంగా చర్చించిన అఖిల పక్షాలు పరిస్థితిని అదుపు చేయడానికి ఏ చర్యనైనా తీసుకోవడానికి ప్రధానికి అధికారమిస్తూ ఏకగ్రీవ