Pages

Sunday, December 30, 2012

కార్యాచరణే కాలమానం





కాలం ఒక ప్రవాహం
కాలం ఒక ప్రభావం
కాలం ఒక ప్రణాళిక
కాలం ఒక ప్రహేళిక
కాలం ఒక సవాలు
కాలం ఒక జవాబు
కాలం ఒక చిత్రం
కాలం ఒక సూత్రం
కాలం ఒక అవకాశం
కాలం ఒక అవరోధం

కాలం సరిపోవాలి గాని చెప్పుకుంటూ పోతే కాలం గురించి ఇలా ఎన్నయినా పరస్పర విరుద్ధ విషయాలు ఏకరువు పెట్టొచ్చు.
కాలం గురించి ఆలోచనా పరులంతా ఏదో చెబుతూనే వచ్చారు. కవులు కావ్యాలు వెలువరించారు. శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు. చేస్తున్నారు. కాలంతో పరుగు తీయాలని మానవులు కలలు కంటూనే వున్నారు. కాలాన్ని జయించేశామనుకునే లోపలే మళ్లీ అది కవ్విస్తూ సవాలు చేస్తూనే వుంది.
ఇన్ని తమాషాలకు కారణం ఒక్కటే- కాలం దానికదే ఏమీ కాదు. కాలమానం ఒక కొలమానం మాత్రమే.
అబ్బిన జ్ఞానాన్ని బట్టి అధ్యయానికి విలువు. వచ్చిన మార్కులను బట్టి రాసిన పరీక్షకు విలువ. వచ్చిన లాభాన్ని బట్టి వ్యాపారానికి విలువ. దిగుబడిని బట్టి సేద్యానికి విలువ.గుణాన్ని బట్టి వైద్యానికి విలువ. రుచిని బట్టి వంటకు విలువ. అలాగే కాలాన్ని విలువ కట్టాలంటే కార్యాచరణతోనే సాధ్యం. కాలాన్ని కొలవడానికి ఏకైక సాధనం కార్యాచరణే. ఎంత సమయంలో ఎంత పని జరిగింది లేదా జరగలేదు అన్నదాన్ని బట్టే కాలానికి విలువ అన్నది మొదటిసూత్రం.
ఎవరు ఏ రంగంలోనైనా వుండొచ్చు. పైన చెప్పుకున్న పనుల్లో ఏది చేసేవారైనా కావచ్చు. సాపేక్షంగా ఎంత సమయంలో ఎంత ఫలితం సాధించారనేదాన్ని బట్టి - లేక ఎంతో సమయంలోనైనా ఏం సాధించారనే దాన్ని బట్టి విలువ కట్టాల్సివుంటుంది.
నీటికి విలువ వుండేది కాదు- ఆనకట్టలు కట్టి నిల్వ చేసుకుని వాడుకోవడం మొదలెట్టాకే బొట్టుబొట్టు లెక్క కట్టడం జరుగుతున్నది. అలాగే జీవరాశులే లేనప్పుడు కాలం గురించిన ఆలోచనే వుండి వుండదు. జంతు జాలమైనా వచ్చాకే వాటి అలవాట్లకు ప్రాకృతిక పరిణామాలకు అనుసంధానం అవసరమైంది. తెలియకుండానే అనుసరించడం మొదలెట్టాయి.మనిషి కూడా మొదటి దశలో ఎన్ని వేల సంవత్సరాలు అనాగరికంగా జంతు సదృశంగా బతికాడో మనకు తెలియదు.ఆ దశలోనూ కాలానికి విలువ గాని లెక్క గాని వుండి వుండదు.మేధా వికాసం జరిగాకే పరిసరాలను అధ్యయనం చేసి విజ్ఞానశాస్త్రం పెంపొందింది. అప్పుడే కాలాన్ని లెక్కగట్టడం మొదలైంది.ఒకసారి మొదలైన తర్వాత వెనకటి కాలాన్ని కూడా గణించే పద్ధతులన్నీ తెలిశాయి. అలా చూసినప్పుడు ఎన్ని సహస్రాబ్దులు అలా స్తబ్దుగా గడిచిపోయాయి? మరి ఇప్పుడో..!
2000 సంవత్సరం నూతన సహస్రాబ్ది వచ్చిందని హడావుడి చేసి అప్పుడే పుష్కర కాలం గడిచిపోయింది. ఆ రోజున అదే పనిగా కేరింతలు కొట్టిన వారు చిందులేసిన వాళ్లు ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవద్దూ.. పన్నెండేళ్లలో సాధించేందేమిటి? అని. అప్పటితో పోలిస్తే ఇప్పుడెక్కడున్నాం?కొత్తగా ఏం నేర్చుకున్నాం? ఏం మార్చుకున్నాం? పుష్కర కాలం పురస్కరించుకుని పరిశీలించుకోవచ్చు.అంత ఓపిక లేకుంటే

Saturday, December 29, 2012

జోహార్లు చిట్టి తల్లీ!


పదమూడు రోజుల పాటు మృత్యువుతో హౌరాహౌరీ పోరాడి అలసి సొలసి ఆఖరి శ్వాస విడిచిన గ్యాంగ్‌రేప్‌ బాధిత యువతి కోసం చెమ్మగిల్లని కళ్లేవీ దేశంలో వుండవు. మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం అని కవి రాసిన మాటలు ఇక్కడ మొత్తం దేశానికి వర్తిస్తాయి. దేశాధినేతలు అన్ని పార్టీల ప్రముఖులూ సకల జన సమూహాలు శోకతప్త హృదయాలతో ఆమెకు ఆఖరి నివాళి సమర్పిస్తూనే అత్యాచార భారతాన్ని అంతమొందించాలని ప్రతిజ్ఞబూనుతున్నారంటే ఆమె మరణం ఎంత ప్రభావం చూపిందో తెలుస్తుంది. అమాయకంగా అమానుష ముష్కరులకు బలైనా ఆమె మరణంలోనూ దేశాన్ని మేల్కొలిపే సమర సంకేతం కావడం నేటి కాల పరిస్థితులకు ప్రతిబింబిస్తుంది. ఈ రాక్షస కాండపై రగిలిన ఆగ్రహం, పెల్లుబికిన యువచైతన్యం, మహిళలపై దుర్మార్గాలు సాగించే వారికి ఒక హెచ్చరిక అవుతుంది. నిత్యం మహిళా జపం చేస్తూనే వారి రక్షణ పట్ల ఘోర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ చాలా సందర్భాల్లో నేరస్తులకు గొడుగు పట్టే పాలకవర్గాలను ప్రకంపింపచేస్తుంది. కాపాడకపోగా కలుషిత సంసృతిని వ్యాపింపచేస్తూ ఆ పైన అమ్మాయిలే అన్నిటికీ బాధ్యులని అవాకులు చవాకులు పలికిన వారికి గుణపాఠం చెబుతుంది. ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ తర్వాత కూడా అనేక ఘటనలు జరిగాయి గనక వీటికి ముగింపు వుండదంటూ ఎవరైనా మాట్లాడితే అంతకన్నా పోరబాటు వుండదు. ఎందుకంటే ఏ విషయంలోనైనా ప్రజల సహనానికి ఒక హద్దు వుంటుంది. అది చెరిగిపోయిన తర్వాత మామూలు మనుషులే మహౌధృతంగా విజృంభించి పిడుగుల వర్షం కురిపిస్తారు. ఆధునిక చైతన్యం గల విద్యాధిక యువతీ యువకులు ఫేస్‌బుక్‌ మెసేజ్‌లతోనే లక్షోపలక్షలుగా దేశం నలుమూలలా కదలి వస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. దేశంలో ఇంత కదలిక రావడానికి కారణమైన ఢిల్లీ యువతి అక్షరాలా అమరజీవిగా మిగిలిపోతుంది. అత్యాచారాలపై పోరాడిన ప్రతిసారీ ఆమె గాధ ప్రతిధ్వనిస్తుంది.

ఢిల్లీ టు తిరుపతి - తెలుగు భాష, రాష్ట్రం



చరిత్రలో యాదృచ్చికంగా కనిపించే అంశాల మధ్య వాస్తవికమైన అంతస్సంబంధం వుంటుంది. తెలుగు భాషా వికాసం కోసం తిరుపతిలో మహాసభలూ, తెలుగు రాష్ట్ర భవిష్యత్తుపై ఢిల్లీలో అగ్రనేతల అఖిలపక్ష సమావేశం ఏక కాలంలో జరగడం అలాటి ఒక సందర్భం.
ముందు అత్యంత కీలకమైన ఢిల్లీ అఖిలపక్ష సమావేశం సంగతి తీసుకుంటే గతంలో జరిగిన రెండు సమావేశాలకు దీనికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది. 2009 డిసెంబర్‌ 9, 23 తేదీలలో చేసిన ప్రకటనల తర్వాత ఏర్పడిన పరిస్థితిని చర్చించి ఒక పరిష్కారం కనుగొనడంపై మొదటి సమావేశం జరిగింది. శాంతి భద్రతలు కాపాడి పరిష్కారం కోసం కృషి చేయాలని అంగీకారం కుదిరింది. ఆ మేరకు శ్రీకృష్ణ కమిటీ ఏర్పడి తనదైన అధ్యయనం చేసి ఆరు అంశాలతో ఒక నివేదిక సమర్పించింది. దాన్ని చర్చించేందుకు తర్వాత మరో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ కమిటీ నివేదికపట్ల అభిప్రాయం చెప్పకుండానే కేంద్రం పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలను సాకుగా చూపి తన మాయాజాలం కొనసాగించింది. అయితే ఈ సమావేశంలో అలాటి ప్రయత్నానికి ఆస్కారం లేకుండా ముకుతాడు వేయడంలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. మీడియా కథనాల ప్రకారం చూస్తే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు కాంగ్రెస్‌ వైఖరి చెప్పకుండా ఇతరులను అడగడం ఏమిటని నిలదీయడం, కాల పరిమితి లేకపోతే కుదరదని పట్టుపట్టడం హౌంమంత్రి ప్రకటన చేయకతప్పని స్థితికి దారి తీసింది. రాష్ట్ర విభజన వద్దనీ, భాషా ప్రయుక్త సూత్రాన్ని కొనసాగించాలని దేశవ్యాపితంగా చెబుతున్న సూత్రాన్నే సిపిఎం ఇక్కడా గట్టిగా పునరుద్గాటిస్తున్నది.మిగిలిన అనేక పార్టీలు వూగిసలాటలకు గురైనా సిపిఎం నికరంగా ఒక్కమాటమీదే వుందన్న వాస్తవం అందరూ ఆమోదించిన పరిస్థితి.ఆ నైతిక దృఢత్వమే రాఘవులు గొంతుకు బలం చేకూర్చడం సహజం. ఇతర పార్టీలు కూడా అదే వైఖరి ప్రకటించిన తర్వాత హౌం మంత్రి లేదా కేంద్రం తలపెట్టిన కాలయాపన తతంగం సాగని స్థితి. ఫలితంగా వచ్చిందే నెల రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామన్న మాట.
సమావేశంలో వివిధ పార్టీలు అనుసరించిన వైఖరి వాటి ధోరణికి ప్రతిబింబంగానే వుంది. టిఆర్‌ఎస్‌ ఇటీవలి వరకూ కాంగ్రెస్‌పై అపారమైన నమ్మకం ప్రకటిస్తూ విలీనం వరకూ ప్రతిపాదించి విమర్శలకు గురైంది. ఈసారి అఖిలపక్షం ప్రయోజనంపైనా పరిపరివిధాల వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలనుంచి వచ్చాయి. తమ జాబితాలో కోదండరాంను తీసుకుపోతామని చెప్పిని అదీ చెల్లుబాటు కాలేదు. చివరకు రాష్ట్రం వస్తుందనే ఆశ భ్రమ లేకుండానే వెళ్తున్నామని కెసిఆర్‌ ముందే ప్రకటించి వెళ్లారు. అందుకు తగినట్టే సమావేశం ముగిసిన తర్వాత అందరూ ఎంతోకొంత సానుకూల సంకేతాలున్నట్టు మాట్లాడితే కెసిఆర్‌ మాత్రం పూర్తిగా ప్రతికూలత ప్రకటించి బంద్‌కు కూడా

Thursday, December 27, 2012

ఐనను పోయిరావలయు హస్తినకు...



ఐనను పోయిరావలయు హస్తిన, కచ్చటి సంధిమాటలె
ట్లైనను,శత్రురాజుల బలాబల సంపద జూడవచ్చు, మీ
మానసమందుగల్గు ననుమానము తీర్పగవచ్చు, తత్సమా
ధానము మీ విధానమును తాతయు ఒజ్జయు విందులెల్లరున్‌

ే తరచూ వినిపించే ఈ పాండవోద్యోగ విజయాల పద్యం ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణా సమస్యపై జరిగే అఖిలపక్ష సమావేశానికి అచ్చంగా సరిపోతుంది. సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రమే దానికి ఎలాటి ప్రాధాన్యత లేదన్నట్టు మాట్లాడింది. హౌం మంత్రి షిండే ప్రకటనే ఆలస్యంగా స్పష్టత లేకుండా ఇచ్చారు.మరుసటి రోజునే గులాం నబీ ఆజాద్‌ హైదరాబాద్‌ వచ్చి కేవలం కొత్తగా శాఖ చేపట్టిన షిండే అవగాహన కోసమే అఖిలపక్షం అని తేలికచేశారు. ప్రత్యేకంగా లేఖ రాసి స్పష్టత ఇస్తామన్న తెలుగు దేశం ఆ లేఖలో అఖిలపక్షం వేస్తే చెబుతామని చెప్పి సరిపెట్టింది. అయతే ఆ లేఖ తమకు అందలేదని చప్పరించిన షిండే ఎంపిలు( నిజానికి తమ పార్టీ వారు) సూచించిన మేరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించుతున్నట్టు లేఖలో రాశారు. ఆ సూచన ఎప్పుడు చేసిందీ అంటే ఎఫ్‌డిఐ ఓటింగులో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా వున్నప్పుడు! అధిష్టానంపై వత్తిడి పెట్టి ఏదో ప్రకటన తెప్పిస్తామన్న వారు ఆఖరుకు సాధించిందేమిటంటే నిర్దిష్ట అజెండా లేని అఖిలపక్షం. సమావేశం జరిపితే చెప్పేస్తామన్న ప్రతిపక్షం చెప్పేదేమంటే వారు చెబితే మేము చెబుతామన్న దాట వేత. ఈ ఇద్దరి మధ్య అసలు ఆ వూసే మాట్లాడని మూడో పక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌.
ే మొత్తంపైన ఇప్పుడు పాలిస్తున్న పార్టీ బాధ్యతారాహిత్యం ఒకటైతే గతంలో పాలించి మళ్లీ పాలించాలనుకుంటున్న పార్టీ, మేమే పాలనకు వస్తామంటున్న పార్టీ కూడా దాగుడు మూతలతో కాలం గడిపేశాయి. 28వ తేదీ ముంగిట్లోకి వచ్చి నిలబడినా సమావేశానికి ఎవరు వెళ్తారన్నది గాని వెళ్లిన వారు ఏమి చెబుతారన్నది గాని బయిటపెట్టడం లేదు. పారదర్శకంగా ప్రజాస్వామికంగా నడవాల్సిన రాజకీయ ప్రక్రియ ఈ విధంగా సస్పెన్స్‌ చిత్రంలాగా మారిపోయిందంటే అందుకు అవకాశవాదం తప్ప మరో కారణం లేదు. మా నిర్ణయమే

Tuesday, December 25, 2012

గొంతులో వెలక్కాయ



జగన్‌ కేసులో నిందితులైన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు అనుమతి నిరాకరించే ఫైలును మంత్రివర్గానికి తిప్పి పంపడం ద్వారా గవర్నర్‌ నరసింహన్‌ పొరబాటును దిద్దుకునే అవకాశం కల్పించినట్టయింది. రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గ నిర్ణయాలను పున: పరిశీలనకై పంపించడం తప్ప పూర్తిగా తిరస్కరించే అధికారం వుండదు. తన విచక్షణను ఉపయోగించే అంశంలో మాత్రం గవర్నర్‌ స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి నియామకం, ఆయనపై గాని మంత్రులపై గాని అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తుకు అనుమతించే అధికారం గవర్నర్‌కు వుంటుంది. దాన్ని ప్రశ్నించే అవకాశం మంత్రివర్గానికి వుండదు. అందులోనూ ే రాజకీయంగా ప్రభుత్వం, పాలక పక్షం అనుదిన అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో గవర్నర్‌ ఫైలును తిప్పిపంపడం కూడా పెద్ద సవాలు. ఈ సమయంలో ప్రాసిక్యూషన్‌కు అనుమతించడం తప్ప ప్రభుత్వానికి వేరే ప్రత్యామ్నాయం లేదని మాడభూషి శ్రీధర్‌ వంటి న్యాయ నిపుణులు సోదాహరణంగా వివరిస్తున్నారు. ధర్మానతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో విచారణ నోటీసులు ఎదుర్కొంటుండగా వాన్‌పిక్‌ కేసుకు సంబంధించి మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శించిందన్న విమర్శలు కూడా మూటకట్టుకుంది.
నైతిక నియమావళి కోసమే పదవికి రాజీనామా సమర్పించానని ధర్మాన గొప్పలు చెబుతున్నా ఆయన రాజీనామా ఆమోదం లేదా తిరస్కారం పొందకుండా అలా త్రిశంకు స్థితిలో సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఎట్టకేలకు ఇటీవలనే క్యాబినెట్‌ సమావేశానికి ఆయనకు ఆహ్వానించడం, తిరస్కరణ సంగతి తేలితేనే వస్తానని