Pages

Saturday, October 15, 2011

శంకర్‌రావు ఆరోపణలపై విచారణ వుత్తిదే!





హౌం మంత్రి సబితా ఇంద్రారెడి, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణలపై
సహచర మంత్రి శంకర రావు చేసిన తీవ్రారోపణలను విచారణకు స్వీకరించవచ్చునని జస్టిస్‌ నరసింహారెడ్డి ఆదేశించినట్టు వచ్చిన వార్తల లోతుపాతులు ఈ బ్లాగులో లోగడ చర్చించాము. అవి కేవలం సిఫార్సులు తప్ప నిర్ణయాలు కాదని, ఆ పని చేయవలసింది వేరే ధర్మాసనమని కూడా చెప్పుకున్నాము.నిజంగానే ఇప్పుడు హైకోర్టు ఉన్నాతాసననం ఆ సిఫార్సును తోసిపుచ్చడమే గాక మంత్రుల విభేదాలలో తలదూర్చవద్దని సలహా ఇచ్చింది. ఈ సందర్భంగానే వార్తా కథనాలను ఎంత మేరకు తీసుకోవచ్చనే దానిలో సింగిల్‌ జడ్జి పరిధి మించారన్న భావన కలిగించే వ్యాఖ్యలు కూడా చేసింది. ఫ్రధాన న్యాయమూర్తి కక్రూ, మరో న్యాయమూర్తి అఫ్జల్‌ పుర్కార్‌లు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత హైకోర్టు పరిస్థితి నేపథ్యంలోనూ, నరసింహారెడ్డి తీర్పుల రాజకీయ ప్రాధాన్యత నేపథ్యంలోనూ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆరోపణల నిజానిజాల కంటే చట్టబద్దమైన పద్ధతులు, కోర్టుల నిబంధనల రీత్యానే ఈ అంశం ప్రస్తావించాల్సి వచ్చింది.ఇంతకూ శంకరరావుపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా వున్నా ఆయన్ను కదిలించలేకపోవడానికి కూడా రాష్ట్ర రాజకీయాలు, అధిష్టానం అనుమతి నిరాకరణే కారణమని కూడా భావిస్తున్నారు. బహిరంగంగా సహచరులపై ఆరోపణలు చేసిన ఆయన మంత్రివర్గంలోనే కొనసాగుతుండగా ఆ ఆరోపణలకు స్పందన లేదా ఖండన లేకపోవడం ఇక్కడ విపరీతం!

No comments:

Post a Comment