Pages

Thursday, August 18, 2011

సిబిఐ దాడులు,, రాజకీయ వ్యాఖ్యలు


జగన్‌ ఆస్తులకు సంబంధించి సిబిఐ విస్త్రత స్థాయిలో సాగిస్తున్న దర్యాప్తు సాగించడం వూహించిన విషయమే.దానిపై రాజకీయ స్పందనలు కూడా అదే కోవలో వున్నాయి. హైకోర్టు ఆదేశం తర్వాత సుప్రీం కోర్టు జోక్యం చేసుకునే లోపలే భూమిక సిద్ధం చేయాలన్న ఆలోచన సిబిఐకి వుందనేది స్పష్టం. అయితే ఇంత జరిగాక ఇది రాజకీయ కక్ష అని జగన్‌ వర్గీయులు విమర్శించవచ్చు గాని అంత మాత్రాన దర్యాప్తును తప్పు పట్టడానికి లేదు. ఈ దర్యాప్తులను గజం మిథ్య పలాయనం చందంగా కొట్టివేయడం కుదిరేది కాదు. ఆయన కాంగ్రెస్‌లో వుంటే కేసు ఇంత దూరం వచ్చి వుండేది కాదు. తనకు స్థానం కల్పిస్తే ఆయన కూడా తిరుగుబాటు చేసి వుండేవారు కాదు. ఎవరి కోణాల నుంచి ఎవరి ప్రయోజనాలను బట్టి వారు వ్యవహరించిన తర్వాత పరస్పర ఆరోపణలకు పెద్ద ప్రాధాన్యత వుండదు. కాకపోతే ఈ నిర్ణయాలను కుంభకోణాలను కేవలం వైఎస్‌ కుటుంబానికే పరిమితం చేసి తాము విశుద్ధ భంగిమలో కనిపించాలన్న కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలు కూడా ఫలించవు. పెట్టుబడులు పెట్టిన సంస్థలన్నిటినీ సోదా చేసినప్పుడు అందుకు దారి తీసిన నిర్ణయాలలో భాగస్వాములైన వారందరినీ విచారించక తప్పదు. వారు ప్రభుత్వం వల్ల ప్రయోజనం పొందలేదని గాని అలాటి వారు పెట్టుబడులు పెట్టలేదని గాని జగన్‌ కూడా చెప్పడం లేదు. ఆ రెండు ప్రక్రియలమధ్య సంబంధమేమిటనేది తేలాలంటే దర్యాప్తు ఏకైక మార్గం. (దీనిపై ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం కూడా ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను.కొంత పునరావృతి వున్నా మళ్లీ ఎడిట్‌ చేయడం కుదరలేదు గనక అలా చదువుకోవాలని మనవి.)

No comments:

Post a Comment