Pages

Friday, October 12, 2012

క్రేజీ కేజ్రీ హడావుడి



రాజకీయాలలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు గాని సమతుల్యత పాటించాల్సి వుంటుంది. సంచలనాలు ఎల్లకాలం వుండవు. స్వంత బలం లేకుండా ప్రచారాలతోనే పనిగడవదు. మీడియాలో అత్యధిక ప్రచారం పొందిన వారు ఎన్నికలలోనూ ఉద్యమాలలోనూ నిలవలేకపోవడం చూస్తూనే వున్నాం. అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమంతో ప్రచారంలోకి వచ్చిన అరవింద కేజ్రీవాల్‌కైనా ఈ మాటలు వర్తిస్తాయి. అన్నా ను మరో గాంధీజీ అన్నంతగా హడావుడి చేస్తున్న రోజునా ఈ మాట చెప్పాను. తర్వాత అవన్నీ నిజమై ఆఖరుకు కేజ్రీవాల్‌ కూడా ఆయన నుంచి విడగొట్టుకున్నారు. స్వంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన కేజ్రీవాల్‌ ఇటీవల సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాపై చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని అందరూ కోరారు. ఆ సందర్భంలో ముందుగా ఖండించిన వ్యక్తి కేంద్రమంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌. తాజాగా కేజ్రీవాల్‌ ఆయనపైనా ఆరోపణలు సంధించడమే గాక ఏకంగా రాజీనామా చేయాలంటూ ప్రధాని నివాసం ముందు ధర్నాకు దిగారు.వాద్రా విషయంలో జరిగిన చర్చ కూడా ఈ అంశంపై జరగలేదు.ఇంతలోనే ధర్నాలు చేసి రాజీనామాలిప్పించాలనుకోవడంలో వాస్తవికత ఏమిటి? ఒక వేళ కేవలం ప్రచారం కోసం ఇలాటి పనులు చేస్తే ఆ ప్రభావం ఎంతో కాలం వుండబోదని టీం అన్నా అనుభవం చెబుతూనే వుంది కదా, క్రేజీ కేజ్రీవాల్‌జీ? పైగా చిల్లర వర్తకంలో ఎఫ్‌డిల వంటి వినాశకరమైన విధాన నిర్ణయాలు వదిలిపెట్టి వ్యక్తుల అవినీతిచుట్టూనే (అదికూడా బిజెపియేతర పార్టీలపై) కేంద్రీకరించడంలో ఆంతర్యం ఏమిటి?

No comments:

Post a Comment