Pages

Wednesday, October 3, 2012

కెసిఆర్‌ చర్చల 'సఫలత' ఎందులో?



కాంగ్రెస్‌ నేతలతో తన తొలి విడత చర్చలు సఫలమైనాయని టిఆర్‌ఎస్‌ అధినేత కె.సి.ఆర్‌ ఢిల్లీ నుంచి  చేసిన ప్రకటన సారాంశం దురూహ్యంగా వుంది. ముఖ్యమంత్రితో సహా కేంద్ర రాష్ట్ర నాయకులు తెలంగాణా మార్చ్‌ ఘటనలు అన్నీ చూసిన తర్వాత కూడా ఆయన అంతా అనుకూలంగా వుందని గత వైఖరిని కొనసాగించడం వాస్తవాలతో పొసగదు. మాయలఫకీరు ప్రాణం లా ఎవరికీ తెలియని రహస్యాలు రాజకీయాల్లో వుండటం కుదరని పని. అసలు గత నెల చివరికల్లా ప్రకటన వస్తుందన్న ఆయన తొలి విడత చర్చలు ముగిశాయని చెప్పడంలోనే అనుకున్నట్టు జరగలేదని ఒప్పుకోవడం వుంది. ప్రహసనంగానైనా, తెలంగాణా ప్రాంత మంత్రులు ఎంపిలకు వున్న మేరకైనా కెసిఆర్‌కు అధిష్టానంపై అవిశ్వాసం అసంతృప్తి లేకపోవడం విచిత్రమే! అయినా అదే ధోరణిలో మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్‌తో వ్యూహాత్మక బంధం ఎంత బలంగా వుందో అర్థమవుతుంది. బహుశా హైదరాబాద్‌ రాగానే మరింత నాటకీయమైన వ్యాఖ్యలు మనం వినొచ్చు.

No comments:

Post a Comment