Pages

Sunday, July 15, 2012

కెసిఆర్‌ సంకేతాలపై సందేహాలు


సెప్టెంబర్‌లోగా తెలంగాణా విభజన జరుగుతుందని తనకు సంకేతాలు వస్తున్నాయని టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన ప్రకటనతో రాజకీయ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండ రాం విభేదించడం చాలా ఆసక్తి కరమైన విషయం. నాకెలాటి సంకేతాలు లేవని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇదే మాట నాలాటి విశ్లేషకులం ఎవరైనా అనివుంటే అనుచిత విమర్శల వర్షం కురిసివుండేది. చిదంబరం అధికారిక ప్రకటనలో లేని సంకేతాలు ఎవరికైనా ఎలా అందుతాయి? జాతీయ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణాపై నిర్ణయం జరుగుతుందని ముఖ్యమంత్రి అంటే కోదండరాం తదితరులు తప్పు పట్టారు గాని నిజానికి అది చాలా సాధారణమైన ప్రకటన. ఆ సృహ కలిగి మెలగకుండా గతంలో పరిపరివిధాల విన్యాసాలు చేసినందుకు కాంగ్రెస్‌ను విమర్శించవచ్చు గాని జాతీయ కోణం చూడకుండా వుండటం ఎలా సాధ్యం?నదీజలాలు మెడికల్‌ సీట్లు ఈ సమస్యలన్నిటిలోనూ విమర్శలు చేయొచ్చు. పరిష్కారాలకై పోరాడవచ్చు కూడా.కాని ఈ స్వార్థపరులైన నేతలకు ఏదో ఒక ప్రాంతంపై ప్రత్యేకంగా ప్రేమ వుండటం కారణమని నేననుకోను.ఎందుకంటే తమ అధికారం పదిలంగా వుండటం,లాభాలు పండించుకోవడం వారికి ముఖ్యం తప్ప ఏ ప్రాంతమైనా ఒకటే. ఇప్పుడు ముందుకొచ్చిన సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిపి ఆచరణ యోగ్యమైన చర్యలు చేపట్టాలి తప్ప అరకొర చర్యలతో అసంతృప్తిని పెంచడం సరికాదు. అలాగే సమస్యలపై కన్నా ప్రాంతాల ప్రజట మధ్య అపార్థాలు పెంచే వ్యూహాలు కూడా మంచిది కాదు.ఈ విషయంలో మంత్రులు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నేతలు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి వుంటుంది. ప్రభుత్వం తరపున సంకేతాల విడుదల బాధ్యతను ఎవరూ తీసుకోకపోవడం మరింత శ్రేయస్కరం.

No comments:

Post a Comment