Pages

Wednesday, July 25, 2012

జగన్‌కూ సాయం చేస్తే పోలా!


అవినీతి ఆరోపణలకు సంబంధించిన జీవోల విషయంలో శ్రీలక్ష్మి మినహా తక్కిన ఐఎఎస్‌లకు సహాయం అందించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వూహించిందే. మంత్రులకు సహాయం చేయాలంటే అధికారులకూ చేయాలి. ఇంకా చెప్పాలంటే వీరందరికీ చేసిన తర్వాత జైలులో వున్న జగన్‌కు కూడా పరోక్షంగా సహాయం చేసినట్టే చెప్పాలి. ఎ ందుకంటే క్విడ్‌ ప్రో వ్యవహారం నడవాలంటే ప్రభుత్వ ప్రతినిధుల తప్పు లేకుండా ఆయనపై ఆరోపణలు నిలవడం కష్టం. సిబిఐకి వ్యతిరేకంగా మంత్రులు అదికారులు జగన్‌ కూడా ఒక వైపునే నిలబడి వాదించే పరిస్థితిని మనం త్వరలోనే చూడాల్సి రావచ్చు. ఇదంతా ఒక రాజకీయ మాయాజాలం. కాని అవినీతి ఆరోపణలకు గురైన వారి తరపున ప్రభుత్వం వకాల్తా పుచ్చుకున్న ఇలాటి తతంగం దేశంలో ఇంత వరకూ జరగలేదని మాత్రం చెప్పొచ్చు.

3 comments:

  1. మీరు 100% correct. ఇదే మాట నేనెప్పడో చెప్పాను.దొంగ బంగారం కొన్న వాడు దొరికాడన్నారు. సరే మరి దొంగ తనం జరిగిందెక్కడో ఎలా జరిగిందో, దానిలో ఎవరెవరున్నారో కూడా చూడాలిగా.ఇప్పుడు ప్రభుత్వం తీరు చూస్తే అసలు దొంగ తనమే జరగలేదని వాదించేటట్లు కనపడుతోంది.అప్పుడు దొంగ బంగారం ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా?.ఇలా అయితే జగన్ మీద quid pro quo case నిలపడదు.అందుకే E.D. ఏమైనా తప్పులు పట్టకోగలదేమోనని చూస్తున్నట్లున్నారు. Cabinet మంత్రులూ తప్పుచేయక ఆఫీసర్లూ తప్పుచెయ్యక ప్రభుత్వానికి లక్ష కోట్లు నష్టమెలా వచ్చిందబ్బా?

    ReplyDelete
    Replies
    1. తప్పు చేసింది ప్రజలు అందుకే వారే బాగా నష్టపోయారు.

      Delete
  2. వాళ్ళకు ఓ విధంగా డిఫెండ్ చేసుకునేందుకు రాజీవ్-స్వప్రయోజన్-యోజనా లాంటిదేమైనా అవినీతి పథకం వుంటే, దాని కింద ఆర్థిక సహాయం చేస్తున్నారనుకోవచ్చు.

    ReplyDelete