Pages

Monday, September 10, 2012

మూడు పార్టీల ఇక్కట్ల ముచ్చట్లు



కాంగ్రెస్‌, తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌ పార్టీలు తమవైన రాజకీయ సంకటాలలో చిక్కుకున్న కారణంగా ఒకరిని చూసి ఒకరు పెద్దగా ఆనందించే పరిస్థితి కనిపించడం లేదు. నైతిక కారణాల పేరిట రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావును బాధ్యతలు చేపట్టవలసిందిగా కేంద్ర పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ చెప్పడం ఆ పార్టీ అభద్రతా భావానికి నిదర్శనం. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం లేదన్న మాట అంత బలంగా చెప్పకపోయినా ఏదో మేరకు సూచించారు గనక కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కొంత వూరట అయినా సానుకూలంగా ఏమీ చెప్పక పోవడం కూడా గమనించక తప్పదు
తెలుగు దేశం తెలంగాణాపై స్పష్టత ఇస్తానని చెబుతున్నా లేఖ మళ్లీ అందిస్తానని అంటున్నా దాని వల్ల లాభమా నష్టమా అని ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారు. టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ల పాత్ర కీలకం గనక దీనివల్ల వారికే ప్రయోజనం కలిగి ఇతర ప్రాంతాలలో తాము నష్టపోతామా అని వారిలో చాలామంది అడుగుతుంటారు. పార్టీలు లాభనష్టాల లెక్కలు పక్కన పెట్టి విధానాలు నిర్నయించుకోవాలన్నది నిజం. అయితే తెలుగుదేశం ఇప్పుడు పరాజయ పరంపరలలో మునిగివున్నందును ఈ లేఖ మరింత నష్టం తెస్తుందా అన్న సందేహం వారిలో చాలా మందిని వదలడం లేదు. లేఖ కారణంగా ఇతర ప్రాంతాలలో కొంతరు నేతలు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

కాంగ్రెస్‌కు దగ్గరయ్యేది లేనిది కాలమే చెబుతుందని విజయమ్మ చేసిన వ్యాఖ్యను ఆగమేఘాల మీద ఖండించినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు రాజకీయంగా రావలసిన గందరగోళం రానే వచ్చింది. ఎందుకంటే సంబంధిత పార్టీ ఖండించినంత మాత్రాన సమస్యలు వెనక్కు పోవు.ఇటవలి కాలంలో రెండు కాంగ్రెస్‌లు వ్యవహరిస్తున్న తీరుతో తలెత్తిన సందేహాలను ఆమె వ్కాఖ్యలు అధికారికంగా ధృవీకరించినట్టయింది.బిసిలకు వంద సీట్లపై చంద్రబాబుకు లేఖ రాయడం కూడా ఈ కోవకు చెందినదే. మొత్తంపైన జగన్‌ జైలు నుంచి విడుదల కాలేకపోవడం పార్టీలో నిస్తబ్దతకు దారి తీస్తున్నదని, ఆయన కూడా చాలా నిస్ప్రహకు గురవుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.బంద్‌ పాక్షికంగా జరగడం, వైఎస్‌ మూడో వర్ధంతి గతంలో వలె జరక్కపోవడం, పైన చెప్పిన రెండు గందరగోళాలు కూడా పార్టీకి ఇరకాటమే తెచ్చిపెట్టాయి. తెలంగాణపై తెలుగుదేశం లేఖ ఇచ్చేట్టయితే అప్పుడు జగన్‌ పార్టీ దాటవేత సాధ్యం కాని స్థితి అనివార్యమవుతుంది.

No comments:

Post a Comment