Pages

Sunday, September 23, 2012

వేదాంతం వెనక వేయి వెతలు



తెలిసేట్టు చెబితే సిద్ధాంతం, అది తెలియకపోతేనే వేదాంతం అని రాశాడెప్పుడో ఆత్రేయ. మాది జాతీయ పార్టీ సిద్దాంతాల ప్రకారం నడుస్తుందని కాంగ్రెస్‌ నాయకులంటుంటారు గాని నిజానికి ఢిల్లీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో వారెవరికీ తెలియదు. నిజం చెప్పాలంటే మా లాటి వాళ్లను కూడా మీకున్న సమాచారమేమిటని కొందరు అడుగుతుంటారు. ఇప్పుడు తెలంగాణా సమస్య, ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం అలానే వున్నాయి. ఏదో జరుగుతుందని వీరందరికీ తెలుసు గాని ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఏది ఎంత కాలం వుండేదీ అస్సలు అస్సలు తెలియదు. ఇలాటప్పుడే వేదాంతం పుట్టుకొస్తుంది. అందులోనూ మెట్టవేదాంతానికి పెట్టింది పేరయిన భారత దేశంలో సమస్యేముంది? శనివారం నాడు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో వేదాంత ధోరణిలో మాట్లాడారంటే ఇలాటి పరిస్థితులే కారణం అనేది స్పష్టం.

No comments:

Post a Comment