Pages

Wednesday, September 26, 2012

ఆజాద్‌ వ్యాఖ్యల అంతర్యం?



తెలంగాణా మార్చ్‌పై ప్రభుత్వం, జెఎసి తలో వైపునుంచి భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల నిపుణుడు గులాం నబీ ఆజాద్‌ ప్రకటన వెలువడింది.గతంలో చత్తీస్‌ఘర్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌లను మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల నుంచి విడదీసినప్పటి స్థితికీ తెలంగాణా విభజన కోర్కెకూ పోలిక లేదన్నది ఆయన వాదన సారాంశం. అది మొదటి నుంచి తెలిసిన విషయమే. నిజానికి అవి ఫ్రధానంగా గిరిజన లేదా పర్వత ప్రాంతాలతో కూడిన చిన్న రాష్ట్రాలు. ఒక దశలో లాలూ యాదవ్‌ వ్యతిరేకత తెలిపినా తర్వాత తన పునాది బలహీనపడిందని గ్రహించి తలవొగ్గారు. మిగిలిన చోట్ల ఆ మాత్రం ప్రలికూలత కూడా లేదు. జార్ఖండ్‌ కోసం వంద ఏళ్ల ముందు నుంచి ఉద్యమం వుంది. వాటితో పోలిస్తే తెలంగాణా సమస్య భిన్నమైందే కావచ్చు. అయితే ఈ విషయాలన్ని ఇప్పుడే కనిపెట్టినట్టు చెప్పడమే హాస్యాస్పదం. డిసెంబర్‌ 9 ప్రకటన తరుణంలోనూ తర్వాత కూడా కేంద్రానికి ఇవన్నీ తెలియదా?తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా ఇక్కడ ఏకాభిప్రాయం లేదన్న పల్లవి చాటున దాక్కోవడం ఎందుకు? పోనీ ఇదైనా తుది ప్రకటనగా స్పష్టంగా చెప్పేస్తారా అంటే అదీ వుండదు. ప్రజల స్పందన తీరు తెన్నులు గమనించి మళ్లీ సవరణలూ సన్నాయినొక్కులు మొదలెడతారు. నిజానికి కేంద్రం నుంచి ఏవో సంకేతాలు వస్తున్నాయన్న ప్రచారాలు అంచనాలు ఆదార రహితాలని నేను చాలా సార్లు రాశాను. ఇప్పుడు నేరుగానే చెప్పేశారు. అయితే కావలసింది ఇలాటి అరకొర వ్యాఖ్యలు కావు. అధికారిక నిర్ణయాత్మక ప్రకటన. అప్పుడే ప్రజలు ప్రాంతాలు తమ భావాలను బట్టి స్పందిస్తారు. అనిశ్చితి బెడద పోతుంది.

1 comment:

  1. అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :

    http://www.logili.com/

    మీకు బాగా నచ్చిన పుస్తకాల గూర్చి మీ అభిప్రాయాలను,
    రివ్యూ లను వ్రాసి ఈ మెయిల్ అడ్రస్ కు పంపించండి
    review@logili.com
    నచ్చిన రివ్యూ లను మీ పేరు లేక మీ కలం తో ప్రచురింపబడును.

    ReplyDelete