Pages

Thursday, September 15, 2011

రెండు మాసాలా? రెండేళ్లా? రెండూ కాదా?



అధిష్టానాన్ని కలుసుకుని వచ్చిన పిసీసీ పీఠాధిపతి బాన్స్‌వాడలో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఓడిపోతామని తెలిసీ ఇలా ఆదేశించడంలో చూడగలిగితే స్పష్టమైన సంకేతాలే వున్నాయి.టిఆర్‌ఎస్‌తో ప్రస్తుతానికి రాజీ పడదలచలేదని, తమ సా ్థనాన్ని వదులుకోవాలనుకోవడం లేదని తెలుస్తూనే వుంది. పోటీ వద్దనే వారు కూడా ఓటమి భయంతో తప్ప మరే విశాల దృష్టితో కాదు. తెలుగు దేశం అసలు ఎవరూ పోటీ చేయొద్దని చెబుతుంది గాని ఆ మాట వినేవారుండరని వారికీ తెలుసు. టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో గెలిచినా రాజకీయ పరిస్తితిలో దాని వల్ల వచ్చే నాటకీయ తక్షణ పరిణామాలేమీ వుండవు కూడా.కాకపోతే రెండు మాసాల్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చేస్తుందని అది ఒక పక్షానికి సంతోషంగా వుండకపోవచ్చని బోత్స అంటున్న మాటను ఎటైనా అర్థం చేసుకోవచ్చు. కాని కాంగ్రెస్‌ ఇచ్చేట్టు లేదన్న కెసిఆర్‌ మాటలు, టి కాంగ్రెస్‌ వాదుల నిర్వేదం బట్టి చూస్తే బొత్స మాటల వెనక వున్నదేమిటో చూచాయగా అర్థమవుతుంది. రెండు మాసాల వ్యవధి కోసం ఇలా అంటున్నారా లేక రెండేళ్ల తర్వాత పరిష్కరిస్తామని అప్పుడు చెబుతారా అనేది కూడా చూడాల్సిందే. గతానుభవాలను బట్టి చూసినప్పుడు ఈ మాటలపై ఏవేవో భాష్యాలు చెప్పుకుని ఆవేశాలు వివాదాలు పెంచుకోవడం అర్థరహితమని గ్రహిస్తే శ్రేయస్కరం.

No comments:

Post a Comment