Pages

Friday, September 23, 2011

కేంద్రం వైఖరిపై అడుగంటిన ఆశలు



త్వరలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తథ్యం అని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రకటించారు. ఇలాటి ప్రకటనే లోగడ కెసిఆర్‌ చేసి తర్వాత సవరించుకున్న తీరు అందరికీ తెలుసు. సకల జనుల సమ్మె ఉధృతంగా జరుగుతుంది గనక కేంద్రం వైఖరి మారుతుందని కొందరు అనుకోవడం అవాస్తవికమే. ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా కేంద్రం అలసత్వాన్ని చెలగాటాన్ని అందరూ అభిశంసిస్తున్నారు. ఇది యాదృచ్చికమేమీ కాదు.ఉద్దేశ పూర్వకమే. సకల సమ్మెపై రేణుకా చౌదరి, అభిషేక్‌ సింఘ్వీ, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అందరూ ఒకే స్వరం వినిపించడం వెనక స్పష్టమైన రాజకీయ సంకేతాలున్నాయి. గత కొద్ది మాసాలలోనూ వివిధ పార్టీల ప్రముఖులతో ఆంతరంగికంగా మాట్లాడినప్పుడు (ప్రాంతాల తేడా లేకుండా) అందరూ చెబుతున్నదేమంటే కేంద్రం ఎలాటి తీవ్ర నిర్ణయం తీసుకోబోవడం లేదు అని. అత్యంత ముఖ్యమైన నేతల మాటలు కూడా అలానే వున్నాయి.. కేంద్రం వైఖరి ఇప్పట్లో మారే సూచనలూ లేవు. మార్చుకుంటే కలిగే లాభం ఏమీ వుండదని వారు గట్టిగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రయోజనాల కోణం నుంచి తప్ప అంతకంటే విశాలంగా ఆలోచించే అవకాశం ఎలానూ వుండదు. ప్రతి వారూ ప్రతిచోటా అడిగే ప్రశ్న ఇదే గనక నాకున్న సమాచారాన్ని పంచుకుంటున్నాను

No comments:

Post a Comment